Friday 30 January 2015

ఇంక ఇప్పుడు యోగా

''శశి మేడం ఎక్కడ ఉన్నారు ? ప్రిన్సిపాల్ రూం లో మీటింగ్ 
జరుగుతూ ఉంది '' ఫోన్ విని క్లాస్ నుండి అక్కడకి వెళ్లాను . 
ఇది  మామూలే .  మీటింగ్ లో ముందు  నేను ఎక్కడ ఉన్నానో 
వెతుకుతారు . రూం అంతా సీరియస్ గా ఉంది . వేడి తెలుస్తూ ఉంది . 
ప్రిన్సిపాల్ గారు ముభావంగా ఉన్నారు . అంటే పై నుండి ఏదో అర్జెంట్ 
పనికి సర్కులర్ వచ్చినట్లే . పని కి భయం లేదు ,కాని ఈ కంప్యుటర్ 
వచ్చినప్పటి నుండి అప్పుడే పెట్టాలి అంటున్నారు . కాలం తో 
పరిగేత్తనీకుండా చేసే  క్షేత్ర స్థాయి అడ్డంకులు  చాలా ఉంటాయి . 
ఎవరికి వాళ్ళే ఎక్కడ ఈ పని తమ మీద పని రుద్దబడుతుందో అని టెన్షన్ . 

''చాలా అర్జెంట్ గా పెట్టాలంట '' చెప్పారు కొలీగ్స్ . 
''ఎన్ని రోజులు అయింది సర్వీస్ లో చేరి , అర్జెంట్ కానిది ఏమైనా ఉంటె 
కొత్తగా చెప్పండి '' పెద్దగా నవ్వాను . 
చిన్నగా అందరి పెదాలు విచ్చుకున్నాయి . 
''అయ్యాన్నీ  నాకు తెలీదమ్మ . ఈ రోజు కధ ఈ రోజే ''చిన్నగా సంతోషం ప్రిన్సిపాల్ గారిలో . 
నిజమే పై అధికారులు చెయ్యమన్నది మనం అడ్డం చెప్పకుండా చేయాలి . 
కొంత చేసి అడ్డం వచ్చినప్పుడు చెపితే కొంత సానుకూల దృక్పధం ఉండొచ్చు . 
కాని చేయడం అందరికీ తప్పనిసరి . 

''చూడండి అందరం ఒకే పడవలో ఉన్నాము . మునిగేది మేడం అనుకోవద్దు . 
పడవ తల కిందులు అయితే అందరికీ ఇబ్బంది ''చెప్పాను . 
సాలోచనగా ఊపి  పనిని ప్లాన్ చేయడం ప్రారంభించారు . 
మెల్లిగా ప్రిన్సిపాల్ గారు కూడా వంగి ప్రేమగా సూచనలు చేయడం 
ప్రారంభించారు . బయట పని పెద్ద ముక్క . తప్పదు సీనియర్స్ తలకు 
ఎత్తుకోవాలి . ఎందుకంటె పిల్లలు చదువులకు హాస్టల్స్ కు వెళిపోతే 
కాసింత పాక్షిక నన్స్  గా మారిపోయాము . జూనియర్స్ ఇంకా 
పిల్లలు , ప్రెగ్నెంట్ లు వగైరా ...... అదీ కాక మా భర్త లకు 
సినిమాకు వెళ్ళాలి అన్నా ''నీకు డ్యూటీ లేదు కదబ్బా '' అని 
అప్పాయింట్ మెంట్ తీసుకొనే జ్ఞానోదయం అయింది . 
పాపం జూనియర్స్ భర్తలు ఇంకా భార్య ల సమయం తమదే అనే భ్రమ లో 
ఉన్నారు ,ఈ జాబ్ చేరినాక కూడా . 
ఏముంది కొన్ని జీతాలుగా కాలం దొర్లితే చిట్టీ లకి , ఇంస్టాల్ మెంట్స్ కి 
అలవాటు పడితే వాళ్లకి కూడా జ్ఞానోదయం అవుతుంది . 

మొత్తానికి బయట పనికి ఎవరో ఒకరు తల అడ్డం పెట్టినాక ఇక స్వచ్చందంగా 
అందరూ తలో పని ముక్క ప్రేమగా ఆ తలను  పెట్టిన వాళ్ళను 
పరామార్శిస్తూ తీసుకుంటారు వీలును బట్టి . 
ఇక అప్పుడు ప్రిన్సిపాల్ గారి ముఖం లో నవ్వు చిందులు వేస్తూ , 
రూం అంతా  వెలిగిపోతూ ఉంటుంది .  

అంతకు ముందు ఉన్న వేడి ఏమైంది !బిగుసుకొని కూర్చున్న వాళ్ళు 
ఎలా అందరు ప్రేమగా మారారు . చిన్న చిరు నవ్వు . 
అవును టెన్షన్ సమయం లో దాని విలువ వందల వేల రెట్లుగా ఉంటుంది . 

మరి అది ఉదయించడం ఎలా ?
''ఇక ఇప్పుడు యోగా '' సమయం దానికి కొంత 
కేటాయిస్తే కందెన వేసిన చక్రం అంత హాయిగా జీవితం దొర్లిపోతుంది . 
దానికి టైం  లేదు అనడం, కార్  లో పెట్రోల్ లేకుండా  నడపడమే . 
తెలివిగల వాళ్ళు పని బాగా జరగడానికి అవసరం అయిన 
ప్రశాంత జీవన శైలిని ముందుగా ప్లాన్ చేసుకుంటారు . అమలు 
చేస్తారు . 
మొన్న 29/1/2015 నుండి మంత్రులకు , పాలనా అధికారులకు 
బాబు గారు జగ్గీ వాసుదేవ్ గారితో యోగా ట్రైనింగ్ ఇప్పిస్తున్నారు . 
మంచిది . నలభై రోజులు ఇచ్చినా మేలే . ఎందుకంటె మనం 
అసహనంతో తప్పు చేస్తే కూడిక లో ఒకట్లో , పదులొ స్థానం లో 
తప్పు జరుగుతుంది . కాని వాళ్ళ స్థాయి లో నిర్ణయాలు అసహనం తో 
తీసుకుంటే కోట్ల స్థానం లో తప్పు జరుగుతుంది . బాబు గారు 
మంచి నిర్ణయం తీసుకున్నారు . పాలనకు ఏమి ఇబ్బంది లేదు . 
ఇప్పుడు మాత్రం నత్త నడకే కదా నడుస్తుంది , బైఫర్గేషన్ పేరుతో . 
పనిలో పని సామాన్యుడు కు కూడా ట్రైనింగ్ ఇప్పిస్తే ఇప్పటి 
నవ్యాంధ్ర ప్రదేశ్  దెబ్బలకు తట్టుకోగలుగుతాడు . 




No comments: