Showing posts with label స్పూర్తి. Show all posts
Showing posts with label స్పూర్తి. Show all posts

Thursday, 23 August 2018

#శివయ్య@75

#శివయ్య@75

 శివయ్య@75
                         #వాయుగుండ్లశశికళ,7-8-2018

శివయ్యా!
భలే వాడివయ్యా 
గుప్పెడు కవితావాక్యాలు జేబులో వేసుకొని వచ్చి 
ఎన్ని హృదయాలు నీ వైపుకు లాగేసావు!

ఒక్కచిగురాకు తాకిడికే తూలే బక్కపలుచని వాడు
ఇన్ని ఆత్మీయతలు ఎలా సాదించాడో చెప్పమంటుంది కాలం 
ఆ రహస్యం నువ్వే చెప్పు
ఒక్క వాక్యం లో వేల నేత్రాలుగా విప్పారడం నీకలవాటేగా 
పెన్న నీళ్లు తాగిన పుణ్యం కాబోలు నెల్లూరు ఈరోజు నీ పుట్టినరోజు వేడుక సంబరంగా జరుపుకుంది 
ఈతకోట వారి సంకల్ప బలం మందిని చేర్చుకొని 
విమర్శలను ఒరుసుకుంటూ చప్పట్ల తీరం చేరిపోయింది!

కొత్తపుస్తకపు పరిమళం లా మా ఊరు వచ్చిన 
కవికి నోరు తీపి చేసి ఆలింగనాల శాలువా కప్పింది
కవిలోకం 

శివా!భూమి ఆకాశం కలిసే చోట ఎక్కడో కలిసే ఉంటాము ......పెనవేసున్న రైలుపట్టాలు ఉన్నాయని రాసుకోనీ వాళ్ళని ,
ఎంత ప్రేమ కురిసింది దేవిప్రియ గారినుండి!

నిలువెత్తు మాటే నువ్వట 
సామాన్యుడికి బలమట
నువ్వు మనవడివి లోకి వెళ్లినా 
మనవడు నీ లోకి వచ్చినా 
జాలువారేది కవిత్వమట
ఏమి మాటలజాలు ఉమగారిది!
నీ దారి నిరంతరం పారే కవితల నది 
ఆత్మీయతలు కు నెలవది 
కాళిదాసు గారి ఆప్యాయత,జయప్రద గారి 
ఆత్మీయత నీ గుండెను నింపే ఉంటాయిలే!

అతడు మేము అంటూ ఎన్ని కలాల కవాతులు
గుండె కవాటాలు తెరిచి ప్రేమను కుమ్మరిస్తూ 

తండ్రి అనురాగాన్ని నీ నుండి పొందినవాళ్ళు 
అమ్మ లాలనను నీ ఒడి లో చూసినవాళ్ళు 
ఇప్పుడు వెదురులు పగలగొట్టి వేణువులు చేసారు, అక్షర రాగాలు ఆలపించడానికి 

నేను ఒక్కణ్ణే అనుకున్నాను,వెనుకకు తిరిగి చూస్తే 
ఎన్నో మిణుగురులు 
ఆ కాంతి వైపు ఎగురుతూ అంటున్నారు 
ఎన్ని గుండెల్లో కవిత్వం వెలిగించావో 
నీ పుట్టినరోజు ఆ వెలుగులో వెలిగిపోతూ ఉంది 
నిరంతర జ్వలనాల కవీ
కన్నీటితో ముంచిన బొటనవేలితో సాక్ష్యం అద్దగల నీ బాటలో ఇప్పుడు వేల పాదాలు 
నీ పథాన్ని చరిత్ర చేస్తూ 
ఇప్పుడు నీ ఆత్మ కథ వేల హృదయాల ప్రేమ కథ!

ఒక సామూహిక స్వరమై ప్రతిధ్వనించే నువ్వు....
శివుడా..నువ్వు శివుడవ్వకూడదు,ప్రజాకవి సత్కీరుడవ్వాలి....
నీ పలకరింపే కవితలకు ఊపిరూదే అమృతం 
శివమెత్తిన తెలుగు పద్యం నువ్వు 
సహనం నీ భుజాన వేలాడే అమ్ములపొది
కవిత్వాన్ని ఎలా చేదుకోవాలో చెప్పి 
మా దోసిట్లో కొన్ని అక్షరాలు పోసి గుండెలకు హత్తుకొని
కవిత్వంలా నిలబడ్డ మనిషివో
మనిషిలా నిలబడ్డ కవిత్వమో!!!
కాలంలోకి వెడతావో
ఒడ్డుకు చేరి కవిత్వం అవుతావో
ఏదైతే నేమిటి 
శివుడా...నువ్వు శివుడవ్వకూడదు,ప్రజాకవి 
సత్కీరుడవ్వాలి 

ఒకటి మాత్రం ఈరోజు అందరికీ తెలిసిపోయింది 
75 ఏళ్ల వయసు నీ దేహానిదే 
నువ్వు ఎప్పుడూ పిల్లల్లో పిల్లవాడివి
యువకుల్లో యువకుడివి 
అందరిలో కలిసిపోయే నెలబాలుడివి 
చేత్తో కవితా కేతనం ధరించి 
చరిత్రకు బాటవేస్తూ కదిలే 
నిరంతర పథికుడివి!!
               @@@@@@
నిన్న 6-8-2018 శివారెడ్డి గారి జన్మ దినం సందర్బంగా నెల్లూరు టౌన్ హాల్  "అతడు మేము"కవితల పుస్తకం ఆవిష్కరించారు .
అందులోని కొన్ని వాక్యాలతో కవితా రూపం లో వ్రాసిన కవితా పుస్తక సమీక్ష.
శివారెడ్డిగారికి నమస్సులతో.....శశి తన్నీరు

Monday, 29 February 2016

మీ అమ్మ కూడా ఇంతేనా ? ఉత్తుత్తి నేనా ?

నివాస్ గాడు పూనే ట్రైనింగ్ కి వెళ్లి ఒకటిన్నర నెల . 
మూడు నెలలు అయితే కాని నెల్లూరు కి రానన్నాడు . 
ఎంత పిల్లలు పెద్ద అయిపోయారు అని మనసుకు 
సర్ది చెప్పుకున్నా తల్లి మనసుకు వాడు ఎలా ఉన్నాడో 
అనిపిస్తూనే ఉంటుంది (అందరికీ ఇంతేనా ?)
మంచి చెడు నేర్పెసాము . ఎంచుకున్న విలువలతో 
తన జీవితాన్ని సార్ధకం చేసుకుంటూ వెళ్ళడం ఇక వాడి పని . 
జన్మ ఇచ్చెసాము ,మంచో చెడో దానిని నడిపించుకోవడం 
వాడి చేతులోనే ఉంది . అబ్బ వాడి చిన్న చేతుల్లో ఇంత 
పెద్ద జీవితం పడుతుందా !
ఇంకా ఏమి చిన్నవాడు ..... చక్కగా మీసాలు వచ్చేసి ఓటు 
హక్కు కూడా వచ్చేస్తే .... 
అయినా సరే అప్పుడప్పుడు చూస్తె బాగుండును . 
హమ్మయ్య వీడియో చాటింగ్ లో దొరికాడు :-)

అదిగో రింగ్ అవుతూ ఉంది . వచ్చేసాడు బిడ్డ స్క్రీన్ మీదకి 
అమ్మా అంటూ ..... ఛీ ఇప్పుడే మా కెమరా బ్లాక్ అవ్వల్నా ?
వాడికి మాత్రం మమ్మల్ని చూడాలి అని ఎంత కోరిక ఉంటుంది !


సరే ఏమి చేద్దాము .... వాడినైనా చూడొచ్చు .... 
''ఏం డూయింగ్ '' అన్నాడు 

''చపాతి ఈటింగ్ '' నవ్వాను . 
''అబ్బ మా నీ చపాతి కూర తిని ఎన్ని రోజులు అయిందో '' 

''ఏది నీ రూం చూపించు రా '' 
చూపించాడు . పిల్లలు వీడి లాగానే ఉన్నారు . 
టి . వి చూపించాడు . ఏమి చూస్తున్నారు ?
ఓహో ..... మీలో ఎవరు కోటీశ్వరుడు ?

''తెలుగు వస్తాయా రా ?'' 
''అన్నీ వస్తాయి మా . నువ్వు ఎలా ఉన్నావు ?
నాన్న ఎలా ఉన్నారు ? విశేషాలు ఏమిటి ?''

''అందరు బాగుండారు . మాకేమి విశేషాలు ఉంటాయి !
నువ్వే చెప్పు '' 

''అమ్మ ఇక్కడ మూడు పూట లు చపాతీలే ,పావ్ బాజీ 
పాని  పూరి . పక్కనే పెద్ద మాల్ ఉంది . ఏమైనా దొరుకుతాయి '' 

అప్పుడెప్పుడో చూసిన వీడియో గుర్తుకు వచ్చింది . 
అక్కడ ఉండే స్టూడెంట్ కి పూనే అమ్మ సాంబారు చేసి పెడితే , 
చెనై లో ఉండే స్టూడెంట్ కి ఇక్కడ ఉండే అమ్మ అక్కడి 
వంటలు చేస్తుంది . అలాగ ఎవరైనా మమ్మీ అక్కడ నా బిడ్డకు 
దొరికితే బాగుండును . అసలే వాడికి టిఫిన్ అంటే ప్రాణం . 
ఎందుకులే వాడికి గుర్తు చేయడం . 

''ఒరే  అక్క కవిత చదువుతుందట '' 
ఓక నిమిషం విని , విననట్లు ఆక్షన్ . 
అందరం నవ్వుకున్నాము . 

''ఇంకేమిటి విశేషాలు ?'' ఈ ప్రశ్న అక్కడి నుండో ఇక్కడి నుండో 
పదిహేనో సారి అడగడం . 
ఏముంటాయి మాట్లాడుకోవడానికి !

కాసేపు ఎడుస్తునట్లు , నవ్వుతున్నట్లు , నాలుక బైట ఉంచి ... 
ఏదో వాడి తేలీ ఫిలిం అక్క్షన్ చేస్తాడు . పర్లేదు బిడ్డ కళ్ళ 
ముందు అల్లరి చేస్తున్నట్లే ఉంది . 

ఎవరు కనుక్కున్నారో ఈ వీడియో కాలింగ్ 
''శతమానం భవతి '' 

ఏముంది మాట్లాడింది ..... అంతా ఉత్తుత్తినే ..... 

అయితే నేమిటి నా బిడ్డ బాగున్నాడు అని తెలిసింది . 
వాడు ఏమి తింటున్నాడు అని తెలిసింది . 
ఫ్రెండ్స్ తో బాగున్నాడు అని తెలిసింది . 
జలుబు లేదు అనుకున్నాను . 
అన్నిటికి మించి అమ్మ తో మాట్లాడాను అనే తృప్తి వాడికి .... 

ఏమి లేదు కాని ...... ఏదో మరి అటు నుండి ఇటు , 
ఇటు నుండి అటు ప్రవహిస్తూ .... 
తల్లి బిడ్డలా బంధం అంతేనేమో ! 

మీ అమ్మ ఇంతేనా :-)
                    @@@@@@@@ 


Thursday, 7 March 2013

మహిళ....ఆకాశం లోనే కాదు ఇలలో కూడా సగమే

నాకు ఎప్పుడూ ఈ రోజు గుర్తుకు వచ్చే ఒకే పేరు 
''ఝాన్సి లక్ష్మి బాయి'' ........ఇంత  కన్నా మహిళలో 
ఒక సమాజం ఏమి ఆశించగలదు.

చురకత్తి లాంటి చూపు,భార్యగానే కాక మంత్రి గా కూడా 
రాజ్య పాలనా నిర్ణయాధికారం,అందర్ని ఓదార్చి నీడన చేర్చుకొనే 
ప్రేమ,ఏ రోజు స్వార్ధం వైపు అడుగేయ్యని భారతీయత....అన్నిటికి మించి 
మగవాళ్ళు కూడా  ఎదిరించి నిలవడానికి భయపడే బ్రిటీష్ వారి ముందు 
కత్తి  దూసి ముందుండి ....ఇది మా రాజ్యం అని వేసిన పోలి కేక....
స్వాతంత్ర సంగ్రామానికే శంఖ ద్వనిలాగా....
అదిగో ఆ తెగువ కావాలి,ఆ నిస్వార్ధత కావాలి,ఎవరిని అడుక్కోకుండా 
ఇవి మావి అని సాధికారంగా గర్జించగల గొంతు కావాలి.

ఎలా ఉండగలరు వీళ్ళు తమకు కుటుంభం కూడా సమాజం తరువాతే అని,
ఎలా ప్రశించగలరు వీళ్ళు నువ్వు చేసేది తప్పు అని లోకాన్నేలే వాళ్ళను అయినా,
ఎలా పోరాడగలరు వీళ్ళు తమ చివరి ఊపిరి దాకా......
ఎక్కడ నుండి వస్తుంది వీళ్ళకి ఆ శక్తి?నిస్వార్ధంగా ఉండటంవలననా,
పూల సున్నితత్వం వలననా?సమాజం కూడా మనలాంటి మనుషులే 
అనే ప్రేమ వలననా ?
అన్నేళ్లు గృహ నిర్భంధం లో ఉంచినా ఒంటరిగానే ఎదుర్కొని 
మాకు ప్రజాస్వామ్యం కావాలి అని నినదించిన ''అంగసాసూచీ''

తనిఖీల పేరుతొ మా శరీరాలను తడిమే అధికారం లేదు అని 
మహిళల కోసం అన్న పానీయాలు మానేసిన ''ఇరోమ్షర్మిలా ''
పన్నెండేళ్ళ క్రితం ఏ గొంతుతో స్తిరంగా చెప్పిందో అదే గొంతుతో 
ఈ రోజు కూడా కోర్ట్ కి చెప్పింది ''నేను ఆత్మహత్య చేసుకునేంత 
పిరికిదాన్ని కాదు.చట్టాలు మమ్మల్ని గౌరవించేలా మారితే 
నేను నోటి ద్వారా ఆహారం తీసుకుంటాను''అని.....పెళ్లి లేదు,
సుఖం లేదు,చివరికి అన్నం లేదు......ట్యూబ్ గుండా వెళ్ళేది ఆహారం 
.........ఏమి చచిపోతే కాని ఈ దేశం లో సానుభూతి రాదా?
ఒక ఎర్ర బొట్టు ముఖపుస్తకం లో తనకు సప్పోర్ట్ గా 
ఎందుకు పెట్టలేకపోయాము?

నా బ్లాగ్ తరుపున వీళ్ళ ఇద్దరినీ తలుచుకుంటూ 
శిరసు వంచి అభివందనం చేస్తున్నాను.

నా బుజ్జి ప్రపంచం లో నేను గమనించే ఇంకో వ్యక్తీ ''వై.ఎస్.భారతి''
గారు.రాజకీయాలు నాకు తెలీవు.కాని భర్త దూరంగా ఉన్నప్పుడు 
పిల్లలను సముదాయించడం మన గుండె పచ్చిపుండు లాగా 
 ఉన్నప్పుడు నాన్న గూర్చి ఆరా తీసే పిల్లల మాటలు 
ములుకులై పొడవడం ఎంత బాధాకరమో నాకు తెలుసు.

ఇక అత్తగారి వైపు వాళ్ళని చూసుకోవడం,కుటుంభానికి 
మచ్చ రాకుండా చూసుకోవడం,ఆర్ధిక వ్యవహారాలూ .....
నిజం ఇవన్నీ ఒక పరిపూర్ణ మహిళ
మాత్రమె చెయ్యగలదు.చాలా మంది పారిశ్రామిక వేత్తలు 
చేసి చూపించారు కూడా.కాని రాత్రి అయ్యేసరికి 
మన పక్కన ఖాళీ లేకుండా స్ఫూర్తి తో నింపి 
ముందుకు నడిపే భర్త ఉంటె ఆ ధైర్యం వేరు.
ఆ ఖాళీ ,ఆ స్పర్శ ఇచ్చే ధైర్యం ఒకరితో చెప్పుకోగలిగినది కాదు.

రెప్పల చాటున కన్నీళ్లు దిగమింగుకొని అందరి ముందు 
ధైర్యం వహించడం సామాన్యం కాదు.
గమనిస్తున్నాను.ఇంతకు  ముందు కంటే సర్క్యులేషన్ 
పెరిగింది,ఫీచర్స్ చక్కగా ఉంటున్నాయి.
ఒకే మూసలో వెళ్లడం లేదు.
చక్కగా చేసే ఉద్యోగులు ఉంటె అదేమీ పెద్ద విషయం అనుకోవచ్చు.
కాని ఎంత మంచి ఉద్యోగులు ఉన్నా నేర్పుతో,ఓర్పుతో అందరిని 
ఒక తాటి మీదకి  తెచ్చే నైపుణ్యం లేకుంటే ఏ బండి ముందుకు కదలదు.
తను ఇంతే చక్కగా జీవితాన్ని నడుపుకుంటూ అందరికి ఆదర్శం 
కావాలి అని ఆశిస్తునాను.

శత్రువు భార్య అయినా ''సోదరా''అని పిలిస్తే పసుపు కుంకుమలతో 
గౌరవించే సంస్కృతీ మనది.
అటువంటి పసుపు కుంకుమ లు నా బ్లాగ్ తరుపున వీరి అందరికి 
కానుకగా ఇస్తున్నాను.

Tuesday, 22 January 2013

మంచి విషయం షేర్ చెయ్యండి

ఇక దేశం అంతటా ''181'' మహిళా హెల్ప్ లైన్ 
 ఇదీ ఈ రోజు చదివిన న్యూస్.మరి లింక్ ఎక్కడా దొరకలేదు.
విషయం ఏమిటంటే ఇంతకూ ముందు మహిళలకు హెల్ప్ లైన్ 
కోసం కేటాయించిన నంబర్ 167 స్తానం లో ఈ నంబర్ కపిల్ సిబాల్ 
గారు మార్చారు.ఇదైతే ఈజీ గా గుర్తు ఉంటుంది అని.త్వరలో ఈ నంబర్ 
రాష్ట్రాలలోకి అమలు లోకి వస్తుందంట.వీలైనంత మందికి షేర్ చేయండి.
నెట్ లో ఉండేవాళ్లకు అవసరం ఉండదులే అనుకోవద్దు...ఎవరికి ఏ 
అవసరం వస్తుందో ఎవరికి తెలుసు.ఈ నంబర్ ద్వారా కౌన్సిలింగ్ 
చేస్తారా?లేదా పోలీస్ సహాయం ఇస్తారా?కంప్లైంట్స్ తీసుకుంటారా?
తెలీలేదు.ఏమి సహాయాలు ఉంటాయో అందరికి తెలిస్తే బాగుంటుంది.
ముఖ్యంగా పాపం పదునాలుగేళ్ళ లోపు చిన్న పిల్లలకి కూడా...
ఏమంటే వారి మీద జరిగే అకృత్యాలు చెప్పుకోలేక వాళ్ళలోనే వాళ్ళు 
కుమిలిపోతున్నారు.
అసలు కౌన్సిలింగ్ చేసే వాళ్ళ అవసరం యెంత ఉంది అంటె అంత ఉంది.
చిన్న విషయానికే ఆత్మహత్య చేసుకొనే వాళ్ళు వాళ్ళ బాధ బయటకు చెప్పేస్తే 
ఆ పని చెయ్యరు.ఇంకా ఇలాంటి ఒక హెల్ప్ లైన్ పిల్లలు మిస్ యూస్ చేయకుండా 
కూడా కౌన్సిలింగ్ ఇవ్వాలి.
ఒక సారి ఒక కధో ,నిజంగా జరిగిన సంఘటనో చదివాను.గుర్తుఉన్నంత
వరకు చెపుతాను,కొంత కల్పితం ఉండొచ్చు.కౌన్సిలింగ్ యెంత ధైర్యాన్ని 
ఇస్తుందో చూడండి.

ఒక ఫాంహౌస్.దానిలో ఒక భార్య భర్త .భార్య కు ఉన్నట్లుండి  
నొప్పులు వస్తాయి(బహుశా ఇది మన దేశం లో జరిగి ఉండదు)
భర్త కంగారు పడుతూ హెల్ప్ లైన్ కి ఫోన్ చేస్తాడు.
అప్పుడు అక్కడ ఒక అమ్మాయి మాట్లాడుతుంది.భర్తను కొన్ని 
ప్రశ్నలు అడిగి ప్రసవం దగ్గర పడింది అని ఆ అమ్మాయికి అర్ధం అవుతుంది.

ఆ అమ్మాయి చెపుతుంది.''మీరు ఏమి కంగారు పడకండి.
నేను ఇప్పుడే మా స్టాఫ్  కి ఇన్ఫాం  చేసాను.
అవును మీకు మొదటి సారి పిల్లలా?''
''అవును '''అని చెపుతాడు భర్త.
''మీరు స్పీకర్ ఆన్ చెయ్యండి''చేస్తాడు.

ఇప్పుడు మీరు ,మీ ఆవిడ మంచి బాబుని మీ ప్రేమకు ప్రతిరూపాన్ని 
చూడపోతున్నారు.యెంత మంచి క్షణాలు.మీ ఆవిడకు కంగ్రాట్స్.
తను చక్కగా మంచి హృదయం తో వాడిని భూమి  మీదకు 
రావాలి అని కోరుకోమనండి.'అంటుంది.
అంత బాధలోనూ ఆ భార్య నవ్వుతుంది.

''మరి మీ భార్య నుదురును ప్రేమగా నిమిరి ధైర్యం చెప్పండి.
ఇదంతా అందరికి మామూలే కదా.ఆమెను సౌకర్యంగా పడుకో పెట్టండి''
అని కొన్ని సూచనలు ఇస్తూ వాళ్లకు ధైర్యం చెపుతూ ఉంటుంది.

''మీరు భయపడాల్సిన పని లేదు మా డ్రైవర్ కి సమాచారం అందింది.
అందరు బయలుదేరుతూ ఉన్నారు.ఒక చక్కని పిల్లవాడిని 
మనం భూమి మీదకు తెస్తున్నాము.మీ అంత అద్రుష్టవంతులు ఇక 
ఎవరూ లేరు''

ఇద్దరు సంతోషపడి ధైర్యం తెచ్చుకుంటారు.
భర్తకు చెపుతుంది కౌన్సిలర్ ''చూడండి భయపడకండి.
ప్రకృతికి మనం అంటె ఎంతో ప్రేమ.మనం అడక్కుండానే మనకు 
కావాల్సినవి అన్ని ఇస్తుంది.ఆమెను కొంచెం ఒర్చుకోమని చెప్పండి.
మీ బాబుని చూసే క్షణాలు వచ్చేసాయి''
''మీ బాబు యెంత అదృష్టవంతుడు.పుట్టగానే ముందు నాన్నను 
చూస్తాడు.ఎవరి పోలికో చూడండి''

ఆమెకు ధైర్యం చెప్పండి మా స్తాఫ్ఫ్ దగ్గరకు వచ్చేసారు.
అవును మీరు సూర్యోదయం చూసారా?యెంత అందంగా ఉంటుంది.
మెల్లిగా సూర్యుడు వస్తూ...వెలుగు రేకలు తెస్తూ ...
మా బాబు కూడా అలాగే వస్తాడు మీ హృదయం లోకి వెలుగు రేకలు తెస్తూ.

మా స్తాఫ్ఫ్ వచ్చేస్తూ ఉన్నారు.మీరు కొంచెం వేడి నీళ్ళు తెచ్చి అక్కడ 
పెట్టండి.అరె బుజ్జి సూర్యుడు వచ్చేసాడా?మెల్లిగా చేతిలోకి తీసుకోండి.
భయపడకండి.ఏమి కాదు.ఇదంతా మామూలే.
మన బాబు ఆరోగ్యంగా మన ముందు ఉండాలి కదా.
వాడు చిరునవ్వుతో తిరుగాడాలి కదా...
ఇలాగా బాబు కి  ఎలా సర్వీస్ చెయ్యాలో చెప్పి వాళ్లకు వేరే 
ఆలోచన లేకుండా చేస్తుంది.వాళ్ళు ధైర్యంగా బాబుని పొందేటట్లు 
భర్త చేత చేయిస్తుంది.అప్పటికి వాళ్ళ స్టాఫ్  అక్కడకు చేరుకొని 
ఫస్ట్ ఎయిడ్ చేస్తారు.



అసలు విషయం ఏమిటంటే అంబులెన్స్ టైర్ పంచర్ అయి వాళ్ళు 
మార్చుకొని వచ్చేసరికి ఇంకా సమయం ఎక్కువ అయింది.
అది కాని చెపితే ఆ భార్య భర్త ఇంకా భయపడి ఉండేవాళ్ళు.
ఆ కౌన్సిలర్ ఇరవయ్యేళ్ళ పెళ్లి కాని అమ్మాయి.అయిన ఏమి 
భయపడకుండా వాళ్ళను భయపెట్టకుండా సరి అయిన దారిలో 
నడిపించింది.భయపడితే ఒక్కో సారి మనం చేయగలిగిన పనులు 
కూడా చెయ్యలేము.
ఈ ''181'' లో ఇలాటి మంచి కౌన్సిలర్స్ ఉంటె ఎన్నో ప్రాణాలు 
నిలబడతాయి.

ప్రభుత్వాలు  ప్రజల కోసం ఎప్పుడో ''నిర్భయ''లాంటి వాళ్ళ బలిదానం 
తరువాత కాకుండా, ఎప్పుడూ ఇలాటి మంచి పనులు చేయాలి 
అని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.

ఏమిటి చూస్తున్నారు ....నంబర్ షేర్ చేయండి 




Saturday, 12 January 2013

ఆ స్పూర్తి ఇప్పటికీ చైతన్య కిరణం

''దివ్యాత్మలారా మేలుకొనండి ''

''Arise awake stop not still the goal  is reached''

''ఇనప నరాలు ఉక్కు గుండెలు ఉన్న యువతే భారత దేశానికి 
కావాలి ''


ఆర్.ఎస్.ఎస్. కొంత మతవిద్వేషాలు రెచ్చగొట్టింది అనే వాదన ఉన్నప్పటికీ
ముగ్గులు వేసుకుంటూనో,పాటలు పాడుకుంటూనే తిరిగే మా లాంటి
ఆడపిల్లలకు ఒక శివాజీ గూర్చి,మేము జిజియా బాయి లాగా పిల్లలను పెంచాల్సిన
అవసరాలు గూర్చి,వివేకానందుని చైతన్య కిరణాల గూర్చి పరిచయం చేసి
ఈ రోజుకు కూడా మా ఆలోచనలు సమాజ శ్రేయస్సు పై ఉండేటట్లు చేసే ఘనత
దానిదే.కత్తి మంచికైనా చేడుకైనా ఉపయోగపడుతుంది.
దేనికి వాడాలి అనే విచక్షణ మనం పెంచుకోవాలి.

ఆయన మాట దూసుకొని పోయే బాణం.
ఆయన పిలుపు వెల్లువలా యువత ను దూకించే శక్తి
ఆయన ఆచరణ తర తరాలలో నిలిచిపోయే జ్ఞాపకం.

వివేకానందుల వారు చక్కని అందగాడు.పైగా విదేశాలకు వెళ్లారు.
అక్కడ మన లాగా నైతిక విలువలకు ప్రాధాన్యత ఇవ్వరు.
ఎందరో ఆడవాళ్ళ దగ్గర నుండి ఆహ్వానాలు.మదువు కళ్ళ ముందరే.

కాని కాళికా దేవి అమృత పానం చేసిన వాడికి ఈ మద్యం ఒక లెక్క కాదు.
ఆత్మ సాక్షాత్కారం పొందిన వాడు ఈ మానసిక దౌర్భాల్యానికి లొంగడు.
ఎక్కడ ఉన్నా నా భారతమే నాకు తీర్ధ స్టలి అని గర్వంగా మానసిక
స్తైర్యం తో యువతకు పిలుపునిచ్చారు.దౌర్భాల్యాలకు లొంగిన యువత
దేశానికి చేసేదేమీ లేదు.పర కాంత మాత తో సమానం.

ఉక్కు సంకల్పంతో ,నైతిక విలువలతో నిలిచి పక్కవారికి
స్పూర్తి నివ్వాలి యువత.
150 జన్మదినం సందర్భంగా ఆయన ను ఒక్క సారి జ్ఞప్తికి తెచ్చుకుందాము.

''శిష్యుడు సిద్దంగా ఉంటె గురువు వచ్చి తీరాలి''
అంటే  గురువే వస్తారు అని కాదు నీకు తెలుసుకోవాలి అనే అభిలాష ఉన్నప్పుడు 
నీకు కావాల్సిన జ్ఞానం పుస్తకంగానో,మనిషి మాట రూపం లోనో 
తప్పక వస్తుంది.నిండిన టీ కప్పులో ఏమి పోయలేము.
అహంకారం తో నిండిన వానికి జ్ఞానం లభించదు .

రామ కృష్ణుల వారు అంటారు 
'పక్క గదిలో ధన రాసులు ఉనాయని తెలిస్తే వాటిని చేరాలి 
అని దొంగ యెంత తపించి పోతాడో అంతగా మనం దేవుని కోసం 
తపించాలి''

''బాలస్తావా క్రీడాసక్త 
స్తరుణస్తావ  త్తరుణీ సక్తః 
వృద్ధ స్టావ చ్చిన్తా సక్తః 
పరే బ్రాహ్మణి కోపి నసక్తః ''


(venu gopal reddy gari article link ikkada)

Tuesday, 25 December 2012

డిల్లీ సంగతి సరే మరి గల్లీ సంగతి?2

భూమి ఆకాశం నువ్వే.....గర్జించు 

ఆగొద్దు ...ఆపొద్దు 
యువతా ఆగొద్దు 
భూమి ఆకాశం నువ్వే అయ్యి గర్జించు 
నీ సహనం మోసే చివరి పుడక ఇదేనని నినదించు .....
గాజులు వేసుకున్న చేతిలోని గాండీవం సవరించు 

యుద్ధం లో గెలిచినా ఝండా అయినా 
కర్మాగారాల్లో కరిగే శ్రామిక శక్తి అయినా 
అక్షరాల్లో  ఒదిగే మేధస్సు అయినా 
ఆకాశాన్ని అంటిన విజ్ఞానం అయినా 
నీ రక్తం నుండి వచ్చినదే 
నీ స్తన్యం తో పెరిగినదే ........

కష్టాన్ని అన్నం గా మారుస్తూ కాలిన చేతులకు 
తక్కువ కూలితో నారేతలు వేస్తూ  పుళ్ళు పడిన పాదాలకు 
తాగి తన్నిన తన్నులకు 
సుఖపడుతూ  మనకు పంచిన రోగాలకు 
మిగిలిన తెల్ల అన్నమే పరమాన్నం గా నింపుకున్న ఆకలికి 
కంట్లో అదిమిన కన్నీటి చుక్కలకు 
కాలే కడుపు తో చేసిన కష్టానికి 
మోసిన నీటి కుండలకు 
మోస్తున్న పరువు బరువులకు 
ప్రతి ఒక్కరు లెక్క చెప్పాల్సిన సమయం ఇదే 

కిరాతకుల కాళ్ళ కింద నలిగిన ఆ చిన్నారి పువ్వు 
స్పృహ వచ్చి  బాధతో మూలిగినపుడు 
సూదులుగా గుచ్చే మాటలను విన్నప్పుడు 
మౌనంగా డిప్రషన్ లోకి వెళ్లబోయే క్షణాన 
మానని గాయాన్నిమాటలతో  పచ్చి పుండు లాగా
కేలుకుతున్నప్పుడు .....మన ధైర్యం 
ఆమెకు ఊపిరి పోయాలి ......
మన తోడ్పాటు ఉత్తెజాన్ని  ఇవ్వాలి .....

ఆగొద్దు యువతా  ఆగొద్దు ....
భూమి ఆకాశం నీవే అయి గర్జించు 

''పరులు కోసం మోగే గుండె 
విప్లవాలు నినదించే డప్పు''

ఆత్మ సాక్షి గల ప్రతి ఒక్కరు నీ వెంటే 
అమ్మ పాలు తాగిన ప్రతి ఒక్కరు నీ వెంటే 
వాళ్లు పిలిస్తే రావాలా?అని ప్రశించే అధికారం 
అమ్మ పాలు తాగామని గుర్తొచ్చి కదలాలి ....
మేము  మీ వెంటే .....
మీ రక్షణే మా భవిత 
అని మేలుకొని మోకరిల్లాలి 

ఆగొద్దు యువతా ఆగొద్దు....
ఆపొద్దు యువతా ఆపొద్దు 
        @@@@@@


''హోంగే కామియాబ్ ....హోంగే కామియాబ్  ఏక్ దిన్
ఓహో మన్మే హై  విశ్వాస్ ....పూరా హై విశ్వాస్ ''

''హం చలేంగే సాత్ సాత్ 
హం చలేంగే సాత్ సాత్ 
హం చలేంగే సాత్ సాత్ .....ఏక్  దిన్ 
ఓహో మన్మే హై  విశ్వాస్ ....పూరా హై విశ్వాస్ 
హం చలేంగే సాత్ సాత్ .....ఏక దిన్ ''

ఈ రోజు సాయంత్రం ఆరు గంటలకు సాక్షి వారు నిరసన ప్రదర్శన 
కొవ్వోత్తులతో పాల్గొనండి.ఇదే కాదు ఏ ప్రదర్శన అయినా 
మీరు పాల్గొనండి.గడ్డి పరకలు ఒక్కటైతేనే ఏనుగును కూడా 
బంధించగలవు.
ఒక్క సారి మార్చ్ ఎనిమిది ఎలా ''మహిళా దినోత్సవం ''వచ్చిందో 
గుర్తు చేసుకోండి.శ్రమ లకు ఓర్వందే....ఏ అవకాశం మనకు 
లభించలేదు.మహిళా సాధికారత మన లక్షం .
బద్రత కావాలి అవశ్యం.
పేపర్ వాళ్లు నిర్వహించిన కొన్ని కార్యక్రమాలు చూసాను.
పాల్గొన్నాను.మనలను గౌరవంగానే చూస్తారు.పలకరిస్తారు.
తప్పకుండా పాల్గొనండి.మన గౌరవం మనమే కాపాడుకోవాలి.
మన బిడ్డలు మనకు యెప్పుడు  తోడూ ఉంటారు.




Monday, 24 December 2012

డిల్లీ సరే....గల్లీల సంగతి ఏమిటి?

అమ్మా మేమందరం మిగిలిన కాలేజ్ వాళ్ల తో కలిసి 
డిల్లీ అమ్మాయి విషయం లో ఏదైనా నిరసన తెలియచేస్తే 
ఎలా ఉంటుంది?అడిగింది పాప.
నా మనసులో ఉన్నది అదే ....మేము ఏదో చెప్పడం,
అభిప్రాయాలు తెలపడం కాదు, ఎవరి దగ్గర నుండి చైతన్యం 
రావాలో అక్కడ నుండి రావాలి.వాళ్ళ విషయాలను ,హక్కులను 
పరిరక్షించుకునే చైతన్యం తప్పని సరి వాళ్లకు.ఎప్పుడూ ఎవరో 
ఒకరు వచ్చి కాపాడరు.అసలు ఆ అమ్మాయికి తోడు ఉన్నారు 
కూడా ,ఏమి అయింది?ఎవరు పిలిస్తే అంత మంది వచ్చారు?
తప్పు ఒప్పులు నిర్ణయించగల విచక్షణే అంత మందిని అక్కడకు 
రప్పించింది.
నేను ఇక్కడ అభిప్రాయాలు ఏమి చెప్పను.కొంచెం విశ్లేషిస్తాను. 
ఎందుకంటె అభిప్రాయాలు అనేవి ఏనుగు పరిశీలించే గుడ్డి వాళ్ళ 
మాటలు లాంటివి.కాలు పట్టుకున్నవాళ్ళు  స్థంభం లాగుంది అంటారు.
తోక పట్టుకున్న వాళ్లు సన్నగా తాడు లాగా ఉంది అంటారు.విజ్ఞతతో 
మనం అన్నీ విని ఒక నిర్ణయానికి రావాలి .
అందరు ఒకే గొంతుతో చెప్పే మాట ''వాళ్లకు పెద్ద శిక్ష పడాలి 
అపుడే మిగిలిన వాళ్లకు భయం ఉంటుంది''అని.నిజమే 
కానీ అదే పరిష్కారం కాదు.తీసుకోవాల్సిన చాలా చర్యలలో 
అది ఒకటి.
రెండోది ......మీరు చదివే ఉంటారు.పక్క రోజు వాళ్ళల్లో కొంత 
మంది తమ తప్పు ఒప్పుకొని తమకు శిక్ష వేయమని ఒప్పుకున్నారు.
మరి ఆ తెలివి ముందు రోజు ఏమి అయింది?సమాధానం అందరికి 
తెలుసు...మద్య పానం .అది మనిషి లోని మృగాన్ని బయటకు తెస్తుంది.
ఆ మృగానికి మనం వేసిన శిక్షలు అప్పుడు భయం కలిగించవు.
ముందు చేయాల్సింది .....దీని గురించిన ఎరుక అందరిలోకి 
తీసుకుని రావడం .తాగడం అనేది మామూలే  అని తాగడం అలవాటు 
అయిన వాళ్లు అనవచ్చు.అందరికి అలవాటు అయినంత మాత్రాన 
అది తప్పు  కాకుండా పోదు.ఖచ్చితంగా వాళ్లు దానిలోనుండి బయటకి 
రావాల్సిందే.
మేము ''లీడ్ ఇండియా''ట్రైనింగ్ లో మానసిక నైపుణ్యాలు అనే 
క్లాస్స్ లో ఏమి చెపుతాము అంటే....ఆలోచనలు>>మాటలు>>
చేతలు>>అలవాటు>>వైఖరి .....ఇలాగ ఒక వరుసలో మనం 
మంచి అలవాట్లు వైపు అయినా,చెడు వైపు అయినా వెళ్ళిపోతాము.
ఆలోచనలు అనే స్టేజ్ లో విచక్షణ అనేది ఉపయోగిస్తే మనం 
మంచి వైపుకు వెళ్లి పోతాము.మనం దీనిని చిన్న పిల్లలు అప్పటి 
నుండి అభివృద్ది చేయాలి.
దీనితో పాటు అమ్మాయిలూ కొంత వరకు ఆత్మ రక్షణ విద్యలు 
నేర్చుకోవాలి.మన పురాణాలలో స్త్రీలు కూడా నేర్చుకొనేవారు.

అసలు వీళ్ళు ఎందుకు బయటకి రావడం అనేవాళ్లకు చిన్న 
విన్నపం .....స్త్రీ పురుష శక్తులు పరస్పరాశ్రితాలు.తెలివి గల 
సమాజం వాళ్ళలోని జ్ఞానాన్ని కూడా చక్కగా వినియోగించుకొని 
ముందుకు వెళ్ళాలి.సగం లోకం లో నిండిన శక్తిని చదువుకున్న 
సంస్కారవంతులుగా ఉన్న మనం చిన్న చూపు చూడ కూడదు.

''ఆడవాళ్ళు కూడా చక్కగా పనులు నిర్వహించగలరు.
సమాజ నిర్మాణం లో వారి భాగం కూడా ఉండాలి 
అనుకొనే వాళ్లు ఈ క్రింది మేటర్ చదవండి''






Monday, 17 December 2012

కొంచెం మా విద్యార్ధినులను దీవించండి

కొంచెం మా విద్యార్ధినులను దీవించండి ....
విషయం ఏమిటి అంటే ''ప్రపంచ తెలుగు మహా సభలు''
సందర్భంగా మా బడిలో చిన్న కవితా శిక్షణ 
కార్యక్రమం పెట్టాను.అందులో పిల్లలు వ్రాసినవే ఈ 
''అక్షరం''కవితా సంకలనం.రాసి లో చిన్నదే ...
మరి వాసి లో అంటారా పిల్లల వయసుని గమనించే 
మీ సహృదయత మీద ఆధారపడి ఉంటుంది.

అయితే ఈ సేకరణ జరిగేటపుడు చాలా మంది పిల్లలు 
వచ్చి మేడం మేము కధలు ఇస్తాము అని అడిగారు.
అప్పుడు నేను ఈ సారి ''కదా సంకలనం'' వేస్తాను అని 
చెప్పి పంపేసాను.
ఈ సారి పిల్లలను వాళ్ళల అమ్మలు,తాతలు,అమ్మమ్మలు 
చెప్పిన కధలు తెమ్మని చెపుదాము అనుకుంటున్నాను.
సంకలనం పేరు''మా పిలకాయల కధలు''
ఇంతకూ ముందు జన విజ్ఞాన వేదిక వారు ఈ ప్రయత్నం 
చేసి ఒక కధాసంకలనం ''మా నెల్లూరు పిల్లోల్ల కధలు''
వెలువర్చి ఉన్నారు.కాని వారు సేకరించింది 
''పుట్టెడు వడ్ల లో పిడికెడు''ఇంకా ఎన్ని ఉన్నాయో.....

అమ్మ వొడిలో వెచ్చగా రగిలి ఊపిరి పోసుకున్న రెక్కల 
గుర్రాలు,తాతయ్య భుజాలపై ఊగుతూ సప్త సముద్రాలు 
దాటించిన కధలు,అమ్మమ్మ వేలు పట్టుకొని ఊహల 
రంగుల రాట్నం తిరిగి సృజనను ఊపిరిగా పీల్చిన కధలు....
బాల్యపు కలలను అందంగా హృదయ పుటలలో 
జ్ఞాపకాలుగా నెమలీక అంత బధ్రంగా దాచుకున్న కధలు ...
ఒక్క సారి ఆ పిల్లల కలం పై మన చెవులు ఉంచితే చాలు 
తమ ఊసులన్ని రంగావల్లులుగా తీర్చి మన ఒడిలో 
రాసులు పోస్తారు.
అయితే సమస్య ఏమిటి అంటే ''స్పాన్సర్స్''కోసం చూస్తున్నాను.
మనం అందరం దీనిలో బాగం పంచుకుంటే ఎలా 
ఉంటుంది?







Friday, 30 November 2012

ప్రివెన్షన్ ఈస్ బెటర్ థాన్ క్యూర్

ప్రివెన్షన్ ఈస్ బెటర్ థాన్ క్యూర్ 

చాలు అర్ధం అయింది కదా.
ముఖ్యంగా మీరు కాదు మీ తరువాతి తరానికి దీని 
గూర్చి అవేర్ చేయండి.పిల్లలతో కొంతవరకైనా 
చెప్పండి.లేకుంటే మీరు ఎన్ని ఆస్తులు కూడపెట్టినా 
పిల్లలకు వృధా.మేము మంచి కార్పరేట్ స్కూల్స్ లో 
వేసాము ,మేము ఏమి చెప్పము అనుకున్నారు అంటే 
ఇక అంతే....అసలు రిస్క్ గ్రూప్స్ టీనేజ్ లోనే ఉన్నాయి.
ఎలాగో టీచర్లు లేసన్స్ లో కొంత చెపుతారు.రెండో వైపుగా 
మీరు ఇది ఒక వ్యాది ఇలాగు వ్యాపిస్తుంది అని మీరు 
చెప్పగలిగినంత వరకు చెప్పండి.అప్పుడు దీపం లాంటి వారి 
భవిష్యత్తు రెండు వైపులా చేయి ఉంచి 
కాపాడిన వారు అవుతారు.
మీ పిల్లలకు మాత్రమె కాదు మీ ఫ్రెండ్స్ పిల్లలకు కూడా 
ఫ్రెండ్లీగా మాట్లాడి విషయం అర్ధం అయ్యేటట్లు చెప్పండి.

చదువుకున్న వాళ్ళగా మనకు చేతనైనంత 
మన చుట్టూ ఉన్న వాళ్ళను అవేర్ చేయడం 
మన బాధ్యత.


ప్రివెన్షన్ ఈస్ బెటర్ థాన్ క్యూర్ 

Wednesday, 28 November 2012

మలాలా యూసఫ్‌జాయ్....గొంతు నులిమిన ఒక కోయిల

అక్కడ పావురాల కుత్తుకలు ఉత్తరించబడుతాయి 
సాంప్రదాయమొక్కకి ఆహారంగా .......
కోయిలల గొంతులు ఆంక్షలకు మెలిపడుతాయి
కొత్తరాగాలు విచ్చుకోకుండా.......
లేడిని వేటాడటం......లేడీని వేదించటం 
అణగతొక్కిన మూలుగులు 
స్వేచ్చ కోసం పోరాటం 
చదువు కోసం ఆరాటం 
బురఖాల వెనుక అదుముకున్న ఆవేశాలు
నిత్యజీవితపు నరకాలు 
లోకానికి కనపడని కోణాలు ......

లేత పూరేకు నేడు విచ్చుకుంది 
ప్రశ్నగా మారి తూటాకు ఎదురుగా నిలిచి 
వేటువేసే  కొడవళ్ళ పై అక్షరాలచిత్రాన్నిపరిచి 
హక్కుల కాలరాతను 
మరణించిన మానవత్వాన్ని 
మా ఉనికి ఎక్కడనే ప్రశ్నను 
కాలపాశంలా లోకంపై విసిరింది 

వేలగొంతుకల స్వేచ్చా నినాదాలు పలుకుతున్న 
ఆ చిన్నారి మొక్కజొన్న పువ్వు 
''మలాలా యూసఫ్‌జాయ్. ''
అడ్డంకుల చేదించు 
వివక్షల సంకెళ్ళు తెంచు 
నీ హక్కులకై ఉద్యమించు 
రేపటి రోజు నీదే.....
ఇందరి ఊపిరే ....నీ శ్వాస.
కళ్ళలో పొంగే ఆశలే ...నీ ఆయుష్షు...
పదుగురికోసం కొట్టుకునే గుండె 
ఉద్యమాల మోతతో మోగే డప్పు 
ఈ రోజు నీవు వ్రాసిన మాట 
కావాలి ఎందరికో స్పూర్తినిచ్చే బాట. 

''మలాలా యూసఫ్‌జాయ్.'' గూర్చిన కధనం 
25/11/2012 నాటి ఫండే లో చాలా బాగుంది .
చదవండి.లింక్ ఇక్కడ ......
(మలైలా చీకటిని ప్రశ్నించిన వెలుగురేఖ )


ఉర్దూలో ‘గుల్ మకాయి’ అంటే మొక్కజొన్న పువ్వని అర్థమట. ‘మలాలా’ అనే పేరు ప్రపంచానికి తెలియకముందు, ఆ కలంపేరుతో తమ ప్రాంతపు వెతను ప్రపంచానికి వెల్లడించింది మలాలా యూసఫ్‌జాయ్. అప్పుడు తన వయసు పదకొండేళ్లు. ఏడో క్లాసు చదువుతోంది. ఇంత చిన్నమ్మాయి ఇదంతా చేసిందంటే అబ్బురమనిపించొచ్చు. కానీ పరిస్థితులు ఎవరినైనా అలా తీర్చిదిద్దుతాయంటుంది తను, పెద్ద ఆరిందలా. తాలిబాన్ల ప్రాబల్యం ఉన్న పాకిస్తాన్‌లోని స్వాత్ ప్రాంతంలో, బాలికల చదువు మీద నిషేధాజ్ఞలున్న విపత్కర ప్రదేశంలో దానికి వ్యతిరేకంగా గళం విప్పింది. 2009 నుంచీ ప్రసార మాధ్యమాల్లో స్పందించింది. పిన్న వయసు విద్యాహక్కుల కార్యకర్తగా మన్ననలందుకుంది. దీన్ని సహించలేని తాలిబాన్లు మొన్న అక్టోబర్ 9న ఆమె మీద కాల్పులు జరిపారు. ఒక దశలో అంతిమసంస్కారాలకు ఏర్పాట్లు చేయడం గురించి ఆలోచించారామె తల్లిదండ్రులు. కానీ క్రమంగా కోలుకుంటోందని వైద్యులు వెల్లడించారు. ఐక్యరాజ్యసమితి నవంబర్ 10ని ‘మలాలా డే’గా ప్రకటించిన నేపథ్యంలో ఈ మొక్కజొన్న పువ్వు ‘బీబీసీ ఉర్దూ ఆన్‌లైన్’లో డైరీ రూపంలో పరిచిన అంతరంగం...

జనవరి 3, 2009; శనివారం:

రాత్రి నాకో భయానకమైన కలొచ్చింది. అందులో తాలిబాన్లు, హెలికాప్టర్లు! స్వాత్‌లో మిలిటరీ ఆపరేషన్ జరుగుతున్నప్పటినుంచీ ఇలాంటి కలలు తరచూ వస్తున్నాయి. 

అమ్మ చేసిన టిఫిన్ తిని స్కూలుకు వెళ్లిపోయాను. స్కూలుకు వెళ్లాలంటే భయమేస్తోంది. ఎందుకంటే, విద్యార్థిను లెవరూ పాఠశాలలకు వెళ్లకూడదని తాలిబాన్లు ఆజ్ఞాపించారు. 27 మంది ఉన్న మా క్లాసులో కేవలం 11 మందిమే వచ్చాం. నా ముగ్గురు స్నేహితురాళ్ల కుటుంబాలు వరుసగా పెషావర్, లాహోర్, రావల్పిండికి వెళ్లిపోయాయి.
స్కూలు నుంచి సాయంత్రం తిరిగొస్తుండగా, ఒకాయన ‘నేను నిన్ను చంపేస్తా,’ అనడం వినిపించింది. భయంతో వేగంగా నడుస్తూ... కొంత దూరం తర్వాత ఆయన నా వెనకే వస్తున్నాడా అని తిరిగిచూశాను. హమ్మయ్య! ఆయన మొబైల్ ఫోన్లో మాట్లాడుతూ ఎవరినో బెదిరిస్తున్నాడు.

జనవరి 4; ఆదివారం:

ఇవ్వాళ మాకు సెలవు కాబట్టి ఆలస్యంగా పదింటికి నిద్రలేచాను. లేచేసరికి, గ్రీన్‌చౌక్‌లో పడివున్న ఏవో మూడు శవాల గురించి మా నాన్న చెబుతున్నాడు. అది వినగానే నాకు చేదుగా అనిపించింది.
ఇంతకుముందైతే ఆదివారాల్లో మార్గజార్, ఫిజాఘాట్, కుంజుకు పిక్నిక్ వెళ్లేవాళ్లం. ఇప్పుడు ఏడాదిన్నరగా బయటికే వెళ్లలేదు. రాత్రి భోజనం తర్వాత సరదాగా వాకింగ్‌కు వెళ్లేవాళ్లం. ఇప్పుడు సూర్యాస్తమయం లోపలే ఇంట్లో ఉంటున్నాం. 

ఈరోజు ఇంట్లో అమ్మకు పనిలో సాయపడ్డాను, కొంత హోమ్‌వర్క్ ఉంటే చేశాను, కాసేపు తమ్ముడితో ఆడుకున్నాను. 

జనవరి 5; సోమవారం:

స్కూలుకు రెడీ అవుతుండగా గుర్తొ చ్చింది, మా ప్రిన్సిపల్ యూనిఫారాల్లో కాకుండా సివిల్‌డ్రెస్సుల్లో రమ్మని చెప్పిన విషయం. కాబట్టి నాకు ఇష్టమైన పింక్‌డ్రెస్ వేసుకున్నాను. మిగతా అమ్మాయిలు కూడా రంగురంగుల దుస్తులు వేసుకోవడంతో స్కూల్లో కాకుండా ఇంట్లో ఉన్నట్టనిపించింది. ఉదయపు అసెంబ్లీలో ‘రంగురంగుల దుస్తులు వేసుకోవద్దు, తాలిబాన్లు అభ్యంతరం చెబుతా’రని ప్రిన్సిపల్ అన్నారు.

ఒక ఫ్రెండ్ నా దగ్గరికొచ్చి, ‘దేవుని మీదొట్టు, నిజం చెప్పు, మన స్కూలుమీద తాలిబాన్లు దాడిచేస్తారా?’ అని అడిగింది.

స్కూలు నుంచి వచ్చేశాక లంచ్ చేసి, ట్యూషన్‌కు వెళ్లాను. సాయంత్రం టీవీ వార్తల్లో షకర్ద్రాలో పదిహేను రోజుల తరవాత కర్ఫ్యూ తొలగిస్తున్నట్టు చెప్పారు. సంతోషమేసింది. ఆ ప్రాంతంలో మా ఇంగ్లీష్ టీచర్ ఉంటారు. అయితే రేపట్నుంచి మేడమ్ స్కూలుకు వస్తారన్నమాట!

జనవరి 7; బుధవారం:

మొహర్రం కాబట్టి బునేర్ వచ్చాం. ఇక్కడి పర్వతాలు, ఆకుపచ్చటి మైదానాలంటే నాకు చాలా ఇష్టం. నా స్వాత్ ఇంతకంటే అందమైనది కానీ అక్కడ శాంతి లేదు. కానీ ఇక్కడ కాల్పులు లేవు, భయం లేదు, ప్రశాంతంగా ఉంది. 
పీర్ బాబా సమాధికి వెళ్లాం. చాలామంది జనం ఉన్నారు. దుకాణాల్లో గాజులు, చెవిరింగులు, లాకెట్స్ అమ్ముతు న్నారు. ఏవైనా కొంటే బాగుంటుందనిపిం చిందిగానీ అంతగా నచ్చలేదు. అమ్మ మాత్రం గాజులు, చెవిరింగులు తీసుకుంది.

జనవరి 14; బుధవారం:

స్కూలుకు వెళ్తున్నప్పుడు ఎందుకో మనసేమీ బాగోలేదు. రేపట్నుంచీ శీతాకాలపు సెలవులని ప్రిన్సిపల్ అనౌన్స్ అయితే చేశారుగానీ మళ్లీ ఎప్పుడు తెరుస్తారో చెప్పలేదు. ఇలా జరగడం ఇదే మొదటిసారి. ఇంతకుముందయితే తేదీ స్పష్టంగా చెప్పేవారు. దీనికి కారణం కూడా ప్రిన్సిపల్ చెప్పలేదు. నేననుకోవడం జనవరి 15 నుంచీ విద్యార్థినుల చదువు మీద తాలిబాన్లు నిషేధం ప్రకటించడమే కారణం.

సెలవులు ఇచ్చినప్పుడు సంతోషపడక పోవడం కూడా ఇదే మొదలు. తాలిబాన్లు ప్రకటించినట్టే జరిగితే మళ్లీ స్కూలుకు రావడమంటూ ఉండదు. కానైతే కొంతమంది అమ్మాయిలు మళ్లీ ఫిబ్రవరిలో స్కూలు ఓపెన్ అవుతుందన్న ఆశతో ఉన్నారు. ఇవ్వాళ చివరిరోజు కాబట్టి స్కూలు మైదానంలో ఎక్కువ సేపు ఆడుకున్నాం. తిరిగి వచ్చేటప్పుడు, మళ్లీ ఇక్కడికి రామేమో! అన్నట్టుగా స్కూలు బిల్డింగు వైపు తదేకంగా చూశాను.

జనవరి 15; గురువారం:

రాత్రంతా ఒకటే కాల్పుల శబ్దం. మూడుసార్లు మెలకువొచ్చింది. అయితే స్కూలు ఎటూ లేదు కాబట్టి పదింటికి నిద్ర లేచాను. ఒక స్నేహితురాలొస్తే కాసేపు హోమ్‌వర్క్ గురించి మాట్లాడుకున్నాం.

ఈరోజే మొదటిసారి బీబీసీ-ఉర్దూ బ్లాగులో నేను రాసిన డైరీని ఒక పేపర్ అచ్చువేస్తే చూశాను. అమ్మకు నా కలంపేరు గుల్‌మకాయ్(మొక్కజొన్న పువ్వు) బాగా నచ్చింది. ఇకనుంచీ నాపేరు అలా మారిస్తే బాగుంటుందికదా, అని నాన్నతో అంది. నాక్కూడా అలాగే అనిపించింది. నా అసలు పేరుకు అర్థం ‘దుఃఖంతో కూడిన’.
ఇంతకుముందెవరో ఈ డైరీ ప్రింట్ అవుట్ చూపించి, మా నాన్నతో ‘భలే బాగుంది,’ అన్నారట. నాన్న నవ్వి ఊరుకున్నారటగానీ రాసింది మా అమ్మాయేనని ఒక్క మాటైనా చెప్పలేదట.

జనవరి 16; శుక్రవారం:

ప్రభుత్వం మా స్కూళ్లను కాపాడుతుందని నాన్న అన్నారు. ప్రధానమంత్రి కూడా ఈ అంశం గురించి మాట్లాడారు. ముందయితే భలే సంతోషమేసిందిగానీ, నాకైతే నమ్మకం కుదరడం లేదు. స్వాత్‌లో రోజూ ఎంతోమంది సైనికులు చనిపోతున్నారు, ఎంతోమంది కిడ్నాప్ అవుతున్నారు. పోలీసులయితే ఎక్కడా కనిపించరు.
అమ్మానాన్న కూడా భయంగానే ఉన్నారు. అమ్మాయిలు స్కూళ్లకు వెళ్లొచ్చని తాలిబాన్లు ఎఫ్‌ఎం రేడియోలో ప్రకటించే దాకా నన్ను బడికి పంపమన్నారు. 

జనవరి 19; సోమవారం:

ఈరోజు మరో ఐదు స్కూళ్లు తాలిబాన్ల దాడిలో ధ్వంసమైనాయి. అందులో ఒకటి మా ఇంటి దగ్గరిది. ఎటూ స్కూళ్లు మూసేశారుకదా, మళ్లీ వాటిని పేల్చేయడమెందుకో నాకు అర్థంకాలేదు. తాలిబాన్లు పెట్టిన డెడ్‌లైన్ ప్రకారం ఎవరమూ స్కూళ్లకు వెళ్లలేదు.

జనవరి 22; గురువారం:

పరిస్థితి ప్రమాదకరంగా ఉంది. రాత్రి మౌలానా షా దౌరాన్(తాలిబాన్ మతగురువు) ఎఫ్‌ఎం రేడియోలో ఆడవాళ్లు ఎవరూ ఇంట్లోంచి బయటకు రావొద్దని ప్రకటించారు. (స్కూళ్లకు వెళ్లొద్దని ప్రకటించింది కూడా ఈయనే.) సైన్యం తమ సెక్యూరిటీ పోస్టులుగా వాడుకుంటున్న పాఠశాలల్ని కూడా తాము పేల్చేస్తామన్నారు. హాజీ బాబా ప్రాంతంలోని స్కూళ్లల్లోకి సైన్యం వచ్చిందని నాన్న చెప్పారు. దేవుడా! వాటిని కాపాడు. ముగ్గురు దొంగలకు రేపు బహిరంగ కొరడాదెబ్బల శిక్ష అమలు చేస్తామనీ, ఇష్టమైనవాళ్లు వచ్చి చూడొచ్చనీ దౌరాన్ అన్నారు.

జనవరి 24; శనివారం:

మా యాన్యువల్ ఎగ్జామ్స్ సెలవుల తర్వాత జరగాలి. అయితే తాలిబాన్ల నిషేధం తొలగిపోతేనే అవి జరగడం సాధ్యం. కొన్ని చాప్టర్స్ చదువుకొమ్మని చెప్పారుగానీ నాకు చదవబుద్ధి కాలేదు.

ప్రతిసారీ మా స్కూళ్లో ఆనర్ బోర్డు మీద ఫస్టొచ్చిన వారి పేర్లు రాస్తారు. ఈసారి ఎవరి పేరూ ఉండేట్టు లేదు.

జనవరి 28; బుధవారం: 

మమ్మల్ని ఇస్లామాబాద్ తీసుకెళ్తానని నాన్న ఎప్పుడో మాటిచ్చారు. ఇప్పుడు నిలబెట్టుకున్నారు. రాత్రే ఇక్కడికి వచ్చాం. నాన్న స్నేహితుడి ఇంట్లో ఉన్నాం. ఇస్లామాబాద్ చూడటం ఇదే మొదటిసారి. పెద్ద బంగళాలు, వెడల్పయిన రోడ్లతో నగరం బాగుంది. మా స్వాత్‌తో పోల్చితే మాత్రం ఇక్కడ ప్రకృతి సౌందర్యం ఏమీలేదు. నాన్న మమ్మల్ని లోక్ విర్సా మ్యూజియమ్‌కు తీసుకెళ్లారు. ఇలాంటి మ్యూజియం స్వాత్‌లో కూడా ఉందిగానీ ఈ కాల్పుల్లో అది భద్రంగా ఉంటుందంటే అనుమానమే!

ఒక ముసలాయన దగ్గర నాన్న పాప్‌కార్న్ కొన్నారు. ఆయన ‘పష్తో’లో మాట్లాడుతుంటే, ‘మీది ఇస్లామాబాదేనా?’ అని నాన్న అడిగారు. ‘ఇస్లామాబాద్ ఎక్కడైనా పష్తూన్లదవు తుందా?’ అని ఆయన ఎదురు ప్రశ్నించారు. వాళ్లది మోమంద్ ఏజెన్సీ అనీ, సైనికచర్య వల్ల తమ తావు వదిలేసి బతుకుదెరువు కోసం ఇలా నగరానికి రావాల్సివచ్చిందనీ చెప్పారు. అప్పుడు అమ్మానాన్నల కళ్లల్లో కన్నీళ్లు చూశాను.

జనవరి 31; శనివారం: 

బన్ను నుంచి పెషావర్ వెళ్తుండగా మా స్నేహితురాలు ఫోన్ చేసింది. స్వాత్‌లో పరిస్థితి ఘోరంగా ఉందనీ, నన్ను తిరిగిరావొద్దనీ చెప్పింది. సైన్యానికీ తాలిబాన్లకీ పోరాటం తీవ్రమైందనీ, ఇవ్వాళ ఒక్కరోజే 37 మంది జనం చనిపోయారనీ చెప్పింది.

సాయంత్రానికి పెషావర్ వచ్చాం. చాలా అలసిపోయాం. టీవీ పెడితే స్వాత్ గురించిన రిపోర్టు. కాలినడకన, ఉత్తిచేతుల్తో స్వాత్ నుంచి వలస వెళ్తున్న జనాన్ని చూపించారు. ఇంకో ఛానల్లో ఒకామె, ‘బేనజీర్ భుట్టో హత్యకు ప్రతీకారం తీర్చుకుంటాం,’ అంటోంది. నాన్నను నేనడిగాను: మరి స్వాత్‌లో వందలాది మంది చనిపోతున్నారుకదా, దానికి ఎవరు ప్రతీకారం తీర్చుకోవాలి?

ఫిబ్రవరి 2; సోమవారం:

ఫిబ్రవరి 9న అబ్బాయిల స్కూల్స్ ప్రారంభమవుతున్నట్టుగా నోటీసు బోర్డుల్లో రాశారని నాన్న చెప్పారు. అమ్మాయిల స్కూళ్ల ముందు మాత్రం ఇలాంటి నోటీసులు పెట్టలేదట. అంటే మావి ఓపెన్ కావట్లేదన్నమాట.

ఫిబ్రవరి 9; సోమవారం:

బాలల పాఠశాలలు ప్రారంభమైనాయి. బాలికల ప్రాథమిక విద్య మీద తాలిబాన్లు నిషేధం తొలగించడంతో వారివి కూడా మొదలైనాయి. ప్రైమరీ వరకు మా స్కూల్లో కో-ఎడ్యుకేషన్ ఉంది.

మా చిన్న తమ్ముడి స్కూల్లో 49 మందికి ఆరుగురే వచ్చారట. అందులో ఒక్క పాప. మా స్కూల్లో 700 మందికి 70 మందే వెళ్లారట.

ఫిబ్రవరి 11; బుధవారం:

ఈమధ్య మేము తరచూ ఇవే మాటలు వింటున్నాం: సైన్యం, తాలిబాన్లు, రాకెట్, బాష్పవాయువు, మౌలానా ఫజుల్లా, పోలీస్, హెలీకాప్టర్, చనిపోవడం, గాయపడటం.

ఫిబ్రవరి 16; సోమవారం:

ఈరోజు చాలా సంతోషంగా ఉంది. సైన్యానికీ తాలిబాన్లకూ శాంతి ఒప్పందం కుదిరింది. జనం మిఠాయిలు పంచుకున్నారు. నాకు శుభాకాంక్షలు చెప్పడానికి ఒక స్నేహితురాలు వచ్చింది. ఇన్ని రోజులూ తనను గదిలో బంధించినట్టుగా అనిపించిందని చెప్పింది. మా స్కూలు కూడా తెరుస్తారని ఆశగా ఉన్నాం.

ఫిబ్రవరి 18; బుధవారం:

ఇవ్వాళ మార్కెట్‌కు వెళ్లాను. రద్దీగా ఉంది. చాలా రోజుల తర్వాత ట్రాఫిక్ జామ్ అవడం చూశాను. 
సాయంత్రం, స్వాత్ జర్నలిస్టు మూసా ఖాన్‌ఖేల్‌ను ఎవరో చంపేశారని నాన్న చెప్పారు. మా శాంతి కల చెదిరి పోయినట్లనిపించింది.

ఫిబ్రవరి 23; సోమవారం: 

ఇవ్వాళ స్కూలు తెరుస్తారని తెలిసి, సంతోషమేసింది. కొంతమంది యూనిఫారాల్లోనూ, ఇంకొంతమంది సివిల్ డ్రెస్సుల్లోనూ వచ్చారు. అందరి ముఖాల్లోనూ ఎంతో సంతోషం కనబడింది. చాలారోజుల తర్వాత కలిశాం కదా, ఒకరినొకరం ఆత్మీయంగా కౌగిలించుకున్నాం.
(డైరీలోని కొన్ని భాగాలు)

స్వాత్ నుంచి సమితి వరకు...

పాకిస్తాన్ స్వాత్ జిల్లాలోని ఒక పట్టణం మింగోరా. 1,75,000 జనాభా ఉన్న మింగోరా... స్వాత్ నదికి దగ్గరగా ఉన్న అందమైన పర్యాటక ప్రదేశం. అందుకే దాన్ని ‘స్విట్జర్లాండ్’గా అభివర్ణించారు రెండో ఎలిజబెత్ రాణి. మింగోరాతో సహా స్వాత్ జిల్లాలో తాలిబాన్ల ప్రాబల్యం ఎక్కువ. పాకిస్తాన్ సైన్యానికీ వారికీ మధ్య తీవ్రమైన కాల్పుల తర్వాత ప్రస్తుతం ఈ ప్రాంతం సైన్యం అధీనంలో ఉంది. ఈ మింగోరా పట్టణంలోనే మలాలా 1997 జూలై 12న జన్మించింది. పష్తూన్ కవయిత్రి, ఆంగ్లేయులతో పోరాడిన వీరనారి మలాలాయి పేరుమీదుగా తన కూతురికి మలాలా అని నామకరణం చేశారు జియావుద్దీన్. ఈయన కవి, విద్యాసంస్థల యజమాని.
2009లో తాలిబాన్లు స్వాత్ జిల్లాను ఆక్రమించుకున్నప్పుడు జనవరి 14 నుంచీ బాలికల చదువును పూర్తిగా నిషేధించారు. దీనిమీద ఒక కార్యక్రమం రూపొందించడానికి ‘బీబీసీ’ ప్రయత్నించినప్పుడు, ప్రాణభయంతో గొంతు విప్పడానికి ఎవరూ ముందుకు రాని సమయంలో మలాలా ధైర్యం చేసింది. తర్వాత ‘గుల్ మకాయ్’ పేరుతో అదే బీబీసీ ఉర్దూ బ్లాగులో డైరీ రాసింది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఆకర్షణకు నోచుకుంది. సొంతపేరుతో వెలుగులోకి వచ్చాక మలాలా ‘న్యూయార్క్ టైమ్స్’ పత్రికకు సహా ఎన్నో ఇంటర్వ్యూలిచ్చింది. అంతర్జాతీయ సమాజం ఆమెతో గొంతు కలిపింది. ఇదే తాలిబాన్లకు కంటగింపుగా మారింది.

9 అక్టోబర్ 2012న మలాలా పరీక్ష రాసి స్కూలు బస్సులో ఇంటికి తిరుగు ప్రయాణమవుతున్నప్పుడు, ముసుగు ధరించిన ఒక తుపాకీ వ్యక్తి లోపలికి ప్రవేశించి, ‘ఇందులో మలాలా ఎవరు? లేదంటే అందరినీ కాల్చిపారేస్తాను,’ అని బెదిరించాడు. మలాలాను గుర్తించిన తర్వాత తలమీద, మెడ మీద రెండుసార్లు కాల్చాడు. తీవ్రంగా రక్తమోడిన ఆమెను వెంటనే పెషావర్‌లోని ఆసుపత్రికి తరలించారు. తర్వాత రావల్పిండిలోనూ చికిత్స జరిగింది. అటుపై కేసు తీవ్రత దృష్ట్యా బర్మింగ్‌హామ్ తీసుకెళ్లారు. ఇప్పుడామె క్రమంగా కోలుకుంటోంది. ఈ దాడిలో మలాలాతో పాటు గాయపడిన మరో ఇద్దరు బాలికలు కైనాత్ రియాజ్, షాజియా రంజాన్ పరిస్థితి కూడా నిలకడగా ఉంది. అసభ్యతకు, అవిశ్వాసానికి ప్రతీకగా మలాలాను చూస్తున్నట్టుగా తాలిబాన్ పేర్కొంది. ఆమెతోపాటు, ఆమె తండ్రి జియావుద్దీన్‌ను కూడా ఎప్పటికైనా చంపేస్తామని ప్రకటించింది. అయితే, మలాలా మీద జరిగిన దాడిని నిరసిస్తూ, ఆమె మీద కాల్పులు జరిపిన వారికి వ్యతిరేకంగా సుమారు 50 మంది పాకిస్తాన్ మతగురువుల బృందం ఫత్వా జారీ చేసింది.


‘మలాలా యూసఫ్‌జాయ్ ప్రభుత్వ బాలికల మాధ్యమిక పాఠశాల’

చిన్న వయసులోనే బాలికల విద్య కోసం పోరాడుతున్న మలాలా 2011 సంవత్సరానికిగానూ ‘అంతర్జాతీయ శాంతి బహుమతి’కి నామినేట్ అయి, రన్నరప్‌గా నిలిచింది.
2011 డిసెంబరులో పాకిస్తాన్ తన మొట్టమొదటి ‘నేషనల్ యూత్ పీస్ ప్రైజ్’ను మలాలాకు బహూకరించింది. 
2012 జనవరిలో స్వాత్‌లోని ఒక ప్రభుత్వ బాలికల మాధ్యమిక పాఠశాలకు ఆమె పేరు పెట్టారు.
దాడి జరిగిన తర్వాత, అక్టోబర్ 15న ఆమె ధైర్యసాహసాలను గౌరవిస్తూ పాకిస్తాన్ అక్కడి మూడో అత్యున్నత పౌర పురస్కారం ‘సితారా ఎ షుజాత్’ను ప్రకటించింది

Sunday, 28 October 2012

మీరు నిజంగా భారతీయులేనా?

మీరు నిజంగా భారతీయులేనా?
అవును మరి మీరు ఎప్పుడు నిజంగా 
భారతీయ పౌరులు అవుతారు అంటే పద్దేనిమిది 
సంవత్సరాలు నిండిన తరువాత మీకు వోటర్ 
ఐడింటిటి  కార్డ్ వచ్చి మీరు వోటు వేస్తేనే మీరు ఈ 
దేశ పౌరుడు అయినట్లు.

తమాషా ఏమిటంటే చక్కగా అన్ని విషయాలలో ముందు 
ఉన్న వాళ్ళు దేశం మీద అంతో ఇంతో ప్రేమ ఉన్న వాళ్లకు 
కూడా వోటు హక్కు లేక పోవడం.....ఉన్నా వేయక పోవడం.

మేము ఎలెక్షన్ డ్యూటీ కి వేళుతున్టాము కాబట్టి 
మాకు తెలుసు నిరక్ష్యరాసులు ఎలాంటి పరిస్తితిలో 
వచ్చి వోటు వేస్తారో.అసలు చదువుకున్న వాళ్ళే 
వోటు విలువ తేలీక,అక్కడ మంచి వాళ్ళు లేరు 
మేము ఎందుకు వోటు వెయ్యాలి అని వచ్చి వోటు వెయ్యరు.

అసలు మీకు తెలుసా సమస్యాత్మకం కాని ప్రదేశాల్లో 
కూడా పోలింగ్ శాతం అరవై దాటటం లేదు.నలబై నుండి 
అరవై శాతం పోలింగ్ జరిగితే దానిలో ముప్పై శాతం 
వోట్లు వచ్చిన వాళ్ళు గెలుస్తున్నారు.అంటే డెబ్బై శాతం 
మంది వీళ్ళను కావాలి అనుకోవడం లేదు.వీళ్ళు 
ఇక ఎలాంటి నిర్ణయం తీసుకుంటే మనం దానికి బాధ్యులం 
కావాలి.గ్యాస్,కరంట్,పన్నులు,ఒకటి అనేమిటి మనం వోటు 
వేయని పాపానికి మన మీద పడే భారం అదంతా.....

ఎందుకంటె చదువుకున్న వాళ్ళు వోట్లు వేసారు అనుకోండి ...
కొంత వరకు వీళ్ళు డబ్బుకు లొంగరు.విజ్ఞతను 
పాటిస్తారు.దాని వలన పార్టీలు కొన్న వోట్ల మీదే 
ఆధార పడలేవు.వీళ్ళ వోట్లు కావాలి అంటే కొంత వరకు 
మంచి పాలన చూపాలి.ఇంకా ఎన్నికల ఖర్చు తగ్గించి 
పాలన పై శ్రద్ధ చూపిస్తారు.......నిజంగా జరుగుతుందా 
అంటే లేకుంటే ''ఒబామా''ఎలా గెలిచాడు అక్కడ.
మరి చదువుకున్న వాళ్ళు ''మంచి పౌరులుగా''
నిలబడాలి.
ఎందుకు ఇదంతా చెపుతున్నావు అంటే....
ఇప్పుడు చెప్పే విషయం అందరికి చెప్పండి.

పద్దెనిమిది నిండిన వాళ్ళు,ఓటు హక్కు లేని 
వాళ్ళు వోటు హక్కు కోసం ఆన్ లైన్ లో అప్ప్లై 
చేసుకోవడానికి చివరి తేది ''31-10-2012''

వోటర్ కార్డ్ కోసం ఇప్పుడే అప్ప్లై చేసుకోండి.
మీ దగ్గరి వాళ్లకి చెప్పండి.ఒక మంచి భారత దేశాన్ని 
కోరుకునే వాళ్ళుగా అది మీ బాధ్యత.

దీనికి అప్లై చేసుకోవడానికి కింది లింక్ ఉపయోగించండి.
(వోటర్ కార్డ్ కు అప్లై చేయటానికి లింక్ ఇక్కడ )

Tuesday, 9 October 2012

జీవ వైవిధ్యం ఉంటేనే జీవికి మనుగడ

ప్రక్రుతి లో ఏ జీవి కూడా ఇతర జీవులు  లేక 
దానికి మనుగడ లేదు.
అందుకే పెద్ద వాళ్ళు సంస్కృతీ,సాంప్రదాయం పేరుతొ 
విష జీవుల్ని అయినా,చెట్లని అయినా,భూమిని అయినా 
గౌరవంగా పూజించాలి అని నేర్పించారు.
దానిలోని పరమార్ధాన్ని అర్ధం చేసుకోకుండా 
ఆచరించటం వలన అవి మూఢనమ్మకాలుగా 
మారిపోయాయి.కనీసం మనలను అవహేళన చేసే వారికి 
ఇది ఎందుకు పాటిస్తున్నామో కూడా చెప్పలేని 
పరిస్తితి లో ఉన్నాము.

మన తరువాతి తరాలకు ధనం కాదు ....
వాళ్ళ మనుగడకు  కావాల్సిన చక్కని ప్రకృతిని 
అందించటం...
మన వాళ్ళు మన కిచ్చిన  సంస్కృతీ సంప్రదాయాలలోని 
ఆంతర్యాన్ని వారికి వివరించటం మంచి పౌరులుగా 
మన భాద్యత.

ఈ భాద్యత నన్ను ఇక్కడ ఉన్న శ్రీహరి కోట మీద 
ఆర్టికల్ వ్రాసే వైపు నడిపింది.నిజంగా నా అన్ని 
ప్రచురణలు కంటే ఈ ఆర్టికల్ ప్రచురణ నన్ను ఎంతో
ఆనందింప చేసింది.

''ఈ రోజు (9/10/2012) ఆంద్ర ప్రభ డైలీ లోని లైఫ్  పేజ్ లో

నా ఆర్టికల్ చూడండి ''



Saturday, 16 June 2012

నాన్నకు నమస్సులు....చెట్టులా చల్లగా చూడు...

''ఎందుకు పిల్లలు నాన్న దగ్గర ఉండకుండా అమ్మ దగ్గరకే 
వెళుతుంటారు''అడిగింది మా పాప వాళ్ళ తమ్ముడిని....


''ఏముంది నాన్నలు ఎప్పుడూ రూల్స్ అంటుంటారు 
అందుకని''చెప్పాడు బాబు.


మొన్న వీడు  సీనియర్ ఇంటర్ పాస్ అయ్యాడని తిరుమలకి వెళ్ళాము.
క్యు లో చిన్న,చిన్న పిల్లలతో వీళ్ళు తెగ ఆడుతున్నారు.
అప్పుడు వీళ్ళకు వచ్చిన డౌట్ ఇది.


అవును నాన్న రూలర్......నాన్న హిట్లర్......నాన్న చండ శాసనుడు....
మరి తన మనసులోని సలలితమైన హృదయం ఎవరికి తెలుసు?
కటినత్వం వెనుక ఉన్న కమ్మని భాద్యత ఎవరికి తెలుసు?
తను సర్దుకొని తన మనసులో యెంత మందికి చోటిచ్చాడో,
ఎన్ని భాద్యతలు కళ్ళ నీళ్ళు  గుండె గుమ్మం దాటి రాకుండా మోసాడో 
ఎవరికి తెలుసు?


ఎపుడు వచ్చేస్తుంది ఇంత కమ్మని భాద్యత తెలీకుండా తన జీవితం  లోకి .....


కాంతులీను నక్షత్రాలు జీవం పోసుకొని 
తన ప్రతిరూపంగా చేరపోతున్నారనే 
కమ్మని కబురు విన్నప్పుడా....


పొట్ట మీద మృదువుగా నిమిరినపుడు 
తగిలిన చిన్ని తల నీ తోడూ కావాలి అని 
కోరినపుడా......


ఏదో తెలియని అందం ఎద లోతుల్లో సుడి తిప్పుతుంటే 
తుళ్లిపడి పెదాల్ని ఇంకా రూపుదిద్దని రూపానికి అద్దినప్పుడా.....




ప్రసాదపు పొంగలి అంత  మెత్తగా,పవిత్రంగా 
తన అరచేతుల్లోకి చిన్ని ప్రాణి చేరినపుడా....


చిరు నవ్వుల జిలుగులతో ఎత్తుకొని 
ప్రపంచపు దారులు చూపమని చేతులు 
చాపినపుడా......


వేలు పట్టి నడుస్తూ మనకు  లోకాన్ని 
మరో కోణం లో చూపినపుడా.....


తనయులు తెలీకుండానే మనలో భాగమై త్యాగం లోనే 
ఆనందం  ఉన్నదని  హృదయాన్ని తృప్తితో నిమిరినపుడా....


పిల్లలే జీవితం...పిల్లల కోసమే జీవితం......
పిల్ల విజయమే తన విజయం.......


అమ్మ ప్రేమల పందిరి హత్తుకుంటే ఆనందం.....
కాని ఆ పందిరికి తండ్రే ఆలంబనం.......


తండ్రి చెట్టు.....
తల్లి చెలమ.....
దొరికిన వాళ్ళకే జీవిత మధురిమ.


HAPPY FATHERS DAY 


ఎందరో చక్కగా భాద్యత చూపించి పిల్లలను 
సమాజానికి అందించిన నాన్నలు.
వాళ్ళు అందరికి ఈ పోస్ట్ అంకితం.


ఈ రోజు సాక్షి ఫ్యామిలి లో నాన్నల పేజ్ మీ కోసం