Tuesday 31 July 2012

ఒదుగు.....ఎదుగుతావు

''శశి ...శశి ..నిద్ర లే చూడు''లేపి బస్ కిటికీ గుండా చూపించాడు.
రాత్రి ఎక్కాము టూర్ బస్ కైలాసనాధ కోనకు వెళ్ళటానికి....
ఎక్కి సీట్ లో కూర్చోవటం తడువు....చల్లటి గాలి జో కొడుతూ 
బస్సు కుదుపుల ఉయ్యాలలో...పక్కన అనుకోవటానికి భుజం 
ఇంకేముంది .....కలల సయ్యాటలు ఆడేసి ఇదిగో ఇప్పుడే కళ్ళు 
తెరిచాను.
ఆసక్తిగా కిటికీ లోనుండి చూసాను.''చూడు కొండ కొన మబ్బు 
ముసుగు కప్పుకొని''చెప్పాడు.నిజమే యెంత అందంగా ఉంది 
సూర్యుడు వచ్చి లేపినా ముసుగు తీసే టట్లుగా లేదు.
ఆ రాయి చూడు ..పక్షి లాగా...నేను కూడా ఉత్సాహంగా చూస్తూ 
ఉన్నాను.మబ్బులు వెనుక వెలుగుల రేడు బయటకు వచ్చేట్లు లేడు .
ఇంకా భలే హాయి....మెల్లిగా బస్ కోనకు పొయ్యే దారికి మలుపు తిరిగింది.
పచ్చటి అడివి...తివాచి పరిచి దానిపై నీలపు పందిరి వేసినట్లు.....
ఎక్కడ చూసినా చెట్లు,ముందుగా ఒక ఆశ్రమం వచ్చింది.
తరువాత బస్ ఆపి దిగమన్నారు.మెల్లిగా ముందుకు వెళ్లి 
చూద్దును కదా ...ఓహ్...మనసు గాలిలో తెలిపోతూ వెళ్లి 
మబ్బుల్లో కూర్చుంది.కళ్ళతోనే మబ్బుని,జలపాతాన్ని,ఎత్తైన చెట్లని స్ప్రుశించాను.
ఇంకా మా వారు ఏమి మాట్లాడరు.నేనిక మౌనమే అని తెలుసు.
చూస్తూనే ఉన్నాను...చూస్తూనే ఉన్నాను...తనివి తీరదే...
యెంత మంచి చిత్రకారుడు ...ఏమి రంగులు..ఏమి చైతన్యం.....


ఎదురుగా ఒక యాబై మెట్లు ఒక చిన్న గుడిని చేరుకుంటున్నాయి.
ముందుకు వచ్చిన ఒక రాయే దానికి కప్పు .కింద శివుడు,పార్వతి.
ఎందుకో ఎక్కడ ప్రక్రుతి లోకి వెళ్ళినా వీళ్ళే దర్శనం ఇస్తారు.
గుడి పక్కనే పై నుండి హోరు అంటూ జలపాతం దుముకుతూ ఉంది.
గబా గబా మెట్లు యెక్క బొయ్యి పక్కకి చూద్దును కదా...బాబోయ్ 
దాదాపు తొమ్మిది అడుగుల ఎత్తు  పాము పుట్టలు...కొంచం భయంగానే 
కొన్ని మెట్లు ఎక్కి అక్కడ ఒక రాయి పై కూర్చున్నాం ఇద్దరం.బస్ 
లో వచ్చిన వాళ్ళు అందరు జల పాతం కింద స్నానం చెయ్యటానికి రెడి 
అవుతున్నారు.
రాయి దగ్గర నుండి జలపాతం అలాగా పడుతూ,నా మీదకి..నా లోకి...
అబ్బ ''పై నుండి చూస్తె''అన్నాను.''కుదరదు ఆడ వాళ్ళు యెక్క లేరు''
అన్నాడు.నిజమే ఎవరైనా కళ్ళు అప్పు ఇస్తే బాగుండును.
పద వెళదాము అన్నాడు....కొంచెం ఉండు అని అందరిని చూపించాను.
సరే వాళ్ళు వెళ్ళినాక వెళ్లి స్నానం చేద్దాము అన్నాడు.


చూస్తూ  కళ్ళు మూసుకున్నాను...మూసుకున్నా అదే దృశ్యం.
ఎత్తైన చెట్లచేతులు లేపి ఆకాశం తాకుతూ...కాదు ఆకాశం లో 
ఒదుగుతూ......ఒదుగుతూ ....ఒదుగుతూ....కాదు చెట్లు కాదు..
చైతన్యం...జల తరంగిణి......ఉవ్వెత్తున ఎగసిపడే అలలతో 
జల బిందువుల మువ్వల సరళి,ఎగసి ఎగసి మిడిసిపడే 
తల వంచని తలపులతో ఆనంద తాండవం....ఎవరు ఆపగలరు?


ఎగసి పడే శక్తిని...మందాకినిని.....
''ఒదుగు''అన్నాడు శక్తి స్వరూపిణిగా నాట్యం చేస్తున్న జలాక్రుతిని ...
ఊహూ....కుదరదు....ఉవ్వెత్తున లేచి ఎగసే అలలు విశ్వ గీతికలు 
పాడుతున్నాయి....


లేచి నిలిచాడు పురుషుడు.....''నా జీవన హేతువుగా నిన్ను 
ఆహ్వానిస్తున్నాను''జట లు మూడుసార్లు మంత్రోచ్చారణ తో 
బిగించాడు.


వంగక తప్పలేదు....అలల ఊపు తగ్గింది ...విరుచుకుపడుతున్న ప్రళయాగ్ని 
పురుషుని శిరం చేరింది.చైతన్యపు జ్వాల చల్లారనే లేదు.
ఉండి...ఉండి .....మెరుస్తూ,రగులుతూ ,ఉండక దూకుతూనే 
ఉంది....అలల హోరు డమరుక నాదాన్ని మించి పోతూ...


నా జీవన సహచరి వై నన్ను దాటి పోకు....పర్వతాలను మెట్టె లుగా 
మార్చి తొడిగాడు.ప్రేమగా పాదాల స్పర్శ ...
చిగురాకులా వణికి పొయ్యింది.


అలల తాకిడి నిలిచింది.అల్లనల్ల సాగుతూ ఉంది.ఉరకలేసే 
చైతన్యం ఉండనియ్యట మే లేదు......ఎగసి ఉప్పొంగి 
పర్వతాలపై నుండి  దూకింది....ఉరుము పడినట్లే..ఒకటే 
హోరు..నేను ఒదగను....నేను ఒదగను...  మనసు తుళ్లిపడి 
దూకుతూనే ఉంది.రాళ్ళను ఒరుసుకుంటూ మృదంగ ద్వానం.


హలం తో చాలు గీసాడు పురుషుడు ''ఒదుగు''అన్నాడు.
''కుదరదు''చెప్పింది ఎత్తుగా  దూకుతూ హోరెత్తిన ఘోష...
స్వేద బిందువులను తీసి మేడలో హారంగా వేసాడు ...
చెలి రా మోడు వారిన భూమిని పచ్చని హారాలుగా మార్చి 
సస్యాలు  పండిద్దాము  .


హారపు పరిమళం వివశ ను  చేసింది.హోయల ,లయల 
చాలు వెంట సాగింది.ఏడు అడుగులుగా నడిచిన నేల...
పచ్చని తివాచీలా.....భూమికి పుట్టిన పులకలు మొలకలుగా....
చేతులు చాస్తూ ఆకాశం లో ఎదగటానికి....
పకా  పకా..నవ్వింది...వంకలోకి వెళ్లి మందాకినీ చిరు అలల 
ఊపులో ఉయ్యాలలు ఊగుతూ చేతులు చాచి ఆకాశానికి ఎదగాలని 
ప్రక్రుతి రూపంలో....


వంక లోకి వెళ్ళాడు పురుషుడు....దోసిలిలో తీసుకున్నాడు...
చల్లటి స్పర్శ మేనికి గందం  రాస్తున్నట్లు,మట్టి పరిమళం 
చెలికి వలపులు కలిగిస్తూ...తియ్యగా నవ్వింది 
కష్టాన్ని తీర్చేస్తున్నట్లు....


''ఒదుగు''దోసిలి లోని  నీళ్ళు హృదయం పై పోసుకున్నాడు.
ఇష్టంగా ఒదిగిపోయింది అంత  శక్తి ....పురుషుడి శ్రమ శక్తి ముందు 
ముచ్చటగా......
..........................................................


''శశి లే...వెళదాము''వెళ్లి నీళ్ళ కింద నిలబడి స్నానం చేసాము.
ఇందాకటి భయం ఏమయ్యిందో.....ఏదో శక్తి నీళ్ళ నుండి 
వచ్చి వంటి లోకి చేరుతున్నట్లు....మళ్ళా భయం వేసింది.
చటుక్కున చెయ్యి పట్టుకునాను.''ఏమి భయం నేను ఉన్నాను కదా''
మళ్ళా కొంచెం ముందుకు తీసుకెళ్ళాడు.
కొంచెం అర్ధం అయింది.అవును నీటి ప్రవాహానికి ఇలా ఒకే వైపు 
ప్రవహిస్తున్నందువల్ల విద్యుదయస్కాంత శక్తి వస్తుంది.
మనం కూడా  ఆయస్కాంతం  కాబట్టి మన మీద  పడినప్పుడు...
మనలొ శక్తి మెరుగుపడుతుంది.....ఇనప ముక్క పై అయస్కాంతం 
రుద్దినట్లు.ఏదో అర్ధం అయినట్లే ఉంది.


ఇద్దరం గుడికి వెళ్లి బస్ లో తిరిగి వచ్చేసాము.
కిటికీ నుండి తొంగి చూసాను....మళ్ళా  చెట్లు చేతులు చాపి 
ఆకాశం లో ఒదుగుతూ....అవును ఒదగాలి...అపుడే అందరికి 
సహాయం చేసేటట్లు ఎదుగుతాము.


కళ్ళు మూసుకున్నాను.జ్ఞాపకాల అగిపెట్టె లో మనసుని 
ప్యుపాగా మార్చి ఆవ చేతనను  శుబ్రం చేసుకుంటూ....
అవును జ్ఞానపు రెక్కలు తొడిగిన ఆత్మగా మళ్ళా  తప్పక 
బయటకు వస్తాను.


''ఎప్పుడో.....ఎందుకో?''

Monday 30 July 2012

ఓనమాలు ....అవును దిద్దాల్సిన నిజాలు

బాబోయ్ ...ఎనిమిదో వింత ఇప్పుడే జరిగింది.
''నీకెందుకు రేపు నిన్ను గూడురుకు తీసుకు వెళ్లి 
ఓనమాలు సినిమా చూపిస్తాను''అంటున్నాడు మా అయ్యోరు.


విషయం ఎంటంటే శనివారం కదా మంచి సినిమా అంటున్నారు 
వెళదాము అని గంట ముందే వచ్చి రెడీ అవుతున్నాను.అప్పుడు 
తెలిసింది ఆ సినిమా నాయుడుపేటలో లేదని.....ఇంకేమి చేద్దాము 
గమ్మున కూర్చొని ఉండిపోయ్యాను.అది చూసి పాపం అనిపించిందేమో 
ఈయనకి ఇలా భరోసా ఇచ్చేసారు.ఎందుకు బాబు అంట వరం అంటే...
''నా కళ్ళలో వెలుగు చూడాలి అంట ''
(ఆయన ఎవరో సూరి బావ కళ్ళలో వెలుగు చూడాలి అన్నట్లు )




హమ్మయ్య సినిమాకి ఆదివారం వచ్చేసాము.సూక్ష్మం గా 
కధ  చెప్పాలంటే.......నారాయణ రావు మాష్టారు పెద్దవాడై 
భార్య పోయిన తరువాత అమెరికా లో కొడుకు ఇంట్లో 
మనవడు,మనవరాలుతో గడుపుతూ ఉంటాడు.
అయినా అతని మనసు తన పల్లెటూరు లోనే ఉంటుంది.
ఆ వెలితి భరించలేక ఇంట్లో చెప్పకుండా ఊరికి వెళ్లి 
పోతాడు.విషయం తెలుసుకున్న వాళ్ళ అబ్బాయి తన కోసం 
టాక్సి కి ఫోన్ చేసి అరెంజ్  చేస్తాడు.


దానిలో ఊరికి వెళ్ళే దారిలో తన ఉద్యోగం,తనదగ్గర పదో తరగతి 
చదువుకున్న పిలలు,బావ,అక్కల లాగా ఆదరించిన 
మునసబు గారు....పేద గొప్ప,హిందూ ముస్లిం తేడా లేకుండా 
అందరు ఒకరి పండుగలకు ఒకరు అభినందిన్చుకోవడం....
అందరు సహాయం చేసుకోవటం...ఇలాటివన్నీ గుర్తుకు వస్తాయి.


ఇక కోటి గారి సంగీతం ,సిరి వెన్నెల గారి పాటలు ''సూరీడు 
వచ్చిండు చూడయ్యో''పల్లెటూరి వాతావరణానికి జీవం పోశాయి.


ఇక్కడ పిల్లలు,మాష్టారి అనుభందం మన చిన్నప్పటి జ్ఞాపకాలు 
తడుముతాయి.(ప్రబుత్వ పాట శాల లో చదివి ఉంటె)
కొన్ని సందర్బాలలో కంటి తడి పెటిస్తాయి ,రాజేంద్ర ప్రసాద్ 
గారి నటనే కాదు,ఖదీర్ బాబు గారి మాటలు కూడా.


ముఖ్యంగా సరళ అనే అమ్మాయి బాగా చదువుతుంది కాని పేదరాలు.
కనీసం మార్చుకోను మారు బట్టలు లేనంత.అది చూసి 
మాష్టారు చాల బాధ పడి ''పల్లెటూరి పచ్చదనానిక్లి చిరుగులు 
పడ్డాయమ్మ ....వాటిని కుట్టే సూది దారం ఏమిటో తెలుసా 
అక్షరాలు"అంటాడు.నిజం గా మనసు ఉంటె కళ్ళ నీళ్ళు 
వచ్చేస్తాయి.
మిగిలిన సగం లో తిరిగి వచ్చిన మాష్టారు పల్లె యెంత పాడై  పోయిందో 
చూసి బాధ పడతాడు.బావ చనిపోయి అక్క ఓల్డ్ ఏజ్ హోం లో 
ఉందని తెలుసుకొని తీసుకొచ్చి పల్లెలో ఉంచుతాడు.
తన దగ్గర చదివిన పిల్లలను అందరిని కలుసుకొని ,ఇప్పటి 
పబ్ సంస్కృతీ ,పక్క వాళ్ళను పట్టించుకోక పోవటం,స్వార్ధం 
చూసి బాగా బాధ పడుతాడు.
వీళ్ళందరినీ కలిపి ఆప్యాయతల ఓనమాలు దిద్దించి పల్లెటూరి కి 
మళ్ళీ  కళ  తేవాలని తన శిష్యురాలు ,టీచర్ అయిన సరళ చేత 
పాత విద్యార్ధులు అందరికి ఉత్తరాలు వ్రాయించి ఊరికి 
రప్పిస్తాడు.ఇక్కడ అందరు బాధతో తమ తమ అనుభవాలు చెపుతుంటే 
మన మనసులు మన ఊరికి ఇలాంటి గతి పట్టకూడదు 
అని బాధతో మూలుగుతుంది.

లింక్ చూడండి


చివరికి మాష్టారు మాట్లాడుతూ ఇలాగే మనం మన స్వార్ధానికి 
కాలం తో పరిగెడుతుంటే పిల్లలు పాలు ప్యాకెట్స్ లో నుండి 
వస్తాయని అంటారు అని ,మనిషి మూలాలు ఎప్పుడు 
మట్టిలోనే ఉంటాయని మనకు నీడ నిచ్చి పెంచిన పల్లె ను 
ఎప్పుడూ మర్చి పోకుండా అక్టోబర్ రెండు వెళ్లి గ్రామాలను 
చూసుకొని సహాయం చేస్తే బాగుంటుందని 
వాళ్ళ మనసులు మార్చి పల్లె బాగుకై ఓనమాలు దిద్దిస్తాడు.
చక్కగా  హృదయానికి హత్తుకొనే సినిమా .కాని రెండో భాగం లో 
ఎన్నో కోణాలు స్ప్రుసించాలి అనుకోవటం వలన పరిగేత్తినట్లు
అయిపొయింది.అందరు కలిసి చూడవలసిన ఒక మంచి సినిమా.
ఇది చేసిన వాళ్ళు అందరికి ఒక మంచి జ్ఞాపకం గా మిగిలిపోతుంది అనటం 
వాస్తవం.
ముఖ్యంగా మనసుని హత్తుకొనే సంభాషణలు 
అందించిన ఖదీర్ బాబు గారికి అభినందనలు  
సంస్థ: సన్ షైన్ సినిమా
నటీనటులు: రాజేంద్ర ప్రసాద్, కల్యాణి, గిరిబాబు, చలపతిరావు, రఘుబాబు తదితరలు...
దర్శకత్వం: క్రాంతి మాధవ్
కథ: తమ్ముడ సత్యం
సినిమాటోగ్రఫీ: హరి అనుమోలు
సంగీతం: కోఠి
పాటలు: సిరివెన్నెల
మాటలు: ఖదీర్ బాబు
ఎడిటింగ్: గౌతం రాజు

మీకు ఎవరికైనా మీ ఊరికి  ఏమైనా చెయ్యాలి అనిపిస్తే 
ముందు మీ ఊరి స్కూల్ కి టాయిలెట్స్ కట్టించి నీటి వసతి 
ఏర్పాటు చెయ్యండి ....ప్లీజ్ 


పాపం పిల్లలు యెంత ఇబ్బందో చూడండి 





Saturday 28 July 2012

పిత్రుత్వము సమస్యే పాపం ...

అనగనగ...అనగా...చిన్న కధ
బుజ్జి కోడి పిల్ల ఉంది .అది నాన్న ను వెతుకుతూ 
వెళ్ళింది.ఒక ఎద్దు కనిపించింది.
''నువ్వేనా మా నాన్నవు అడిగింది.
''కాదు మీ నాన్న ఇంకా చిన్నగా ఉంటాడు''చెప్పింది ఎద్దు.


ఇంకా ముందుకు వెళితే మేక కనిపించింది.
''నువ్వేనా మా నాన్నవు ''అడిగింది.
''కాదు మీ నాన్నకు రెండు కాళ్ళు ఉంటాయి''చెప్పింది మేక.


కొంచం దూరం వెళ్ళింది.ఒక బాతు నీళ్ళలో ఈదుతూ కనిపించింది.
''నువ్వేనా మా నాన్నవు?''అడిగింది.
''కాదు మీ నాన్న కొక్కొరోకో అని అరుస్తాడు?''చెప్పింది బాతు 


''మరి తెలుసుకోవడం ఎలాగా?''అడిగింది పిల్ల.
పాపం బాతు కు జాలి వేసింది .ఆ పిల్ల తపన చూసి కళ్ళలో నీళ్ళు
వచ్చాయి.
''ఏమి లేదు బాబు నీకు మీ నాన్నకు జీన్స్ ఒకటే ఉంటాయి...
వెళ్లి డి.ఎన్.ఏ. పరీక్ష చేయించుకో''అనింది.


ఆ కోడి పిల్ల కష్టాలు పడి  వాళ్ళ నాన్న ఎవరో తెలుసుకొని,పరీక్షలు 
చేయించుకొని ప్రపంచానికి నాకు నాన్న ఉన్నాడు అని గర్వంగా 
చెప్పింది.


కాని అందరికి ఇది సాధ్యమా?ఇలాగా పోరాడటం.....


''పుట్టగానే ఆకలి అమ్మను చూపిస్తే....అమ్మ నాన్న ను చూపిస్తుంది''


ఇది లేకుంటే వాళ్ళు సక్రమ సంతానం కాదని ముద్ర వేసేస్తారు.


నేను బాబు పుట్టేటపుడు తండ్రి యెంత ఫీల్ అవుతాడు అనేది 
ఇద్దరు ప్లస్ మిత్రులు అవినేని గారు,శ్రీనివాస్ చౌదరి గారు 
ఇద్దరి పోస్ట్లలో చదివాను.ఆ చిన్నారి బిడ్డ కోసం ఆ కష్టాలు 
ఎదుర్కొని ఒక తండ్రి ఎలా తపన్ పడుతాడో కళ్ళకు కట్టినట్లు 
ఉంది.మరి ఈ ఫీలింగ్స్ ఇలా పుట్టిన వాళ్లకు ఏర్పపడవు ఏమో?


రాజిరెడ్డి గారు వ్రాసినట్లు''ఒక దగ్గర ఇది చెయ్యొద్దు అని వ్రాసి ఉంటె 
అక్కడ అది జరుగుతుందనే కదా అర్ధం"


ఇక్కడ కొందరు చిన్నారులు తండ్రి వీపుపై ఊగుతూ,వేలు పట్టి నడుస్తూ 
కలల ప్రపంచం లో తూగుతున్నారు అంటే ......అక్కడ కొందరు 
తండ్రి తెలీక చీత్కారాలతో చిన్నపోయ్యి....చెత్త కుండీ లకో,నీళ్ళ ప్రవాహం లోకో ,
బతికి ఉంటె సిగ్గు పడుతూ వాడిపోయిన కలువలా 
ముడుచుకు పోతున్నారు అనే కదా అర్ధం.


పసి పిలలు వాళ్ళు వాళ్లకు ఏమి తెలుసు ?
మగ వాళ్ళ కోరికలకు బలిగా తమ తలను ప్రపంచపు 
వధ్యశిల  పై పెట్టామని....


అమ్మ పాల అమృతానికి కూడా నోచుకోక 
ఎంగిలి ఆకులు ఏరాలని......


తండ్రి ఇంటి పేరు,తల్లి పెట్టిన పేరు లేక 
లకారాల మాద్యమం  లో పిలిస్తే పలకాలని.....


చిత్తు కాగితాలు ఏరుతూ,బిచ్చం ఎత్తి బతుకుతూ 
అవిటి జీవితం గడుపుతూ నలగాలని....


నాన్న వేలు పట్టి నడిచే చిన్నారుల చూసి నపుడు 
పగిలే ఆశల బుడగలు రగిలే బాధతో చూడాలని....


పిడికెడు అన్నం  కోసం పది మంది కాళ్ళు వట్టాలని 
మద్యం సీసాలు మోయాలని ...........


చిక్కటి చీకటి లో సత్రాల వెనుక కుక్కలతో పోటీ 
పడి  గెలిచి ఎంగిలి ఆకులతో ఆకలికి ఆయుష్షు పోయ్యాలని 


ఈ దేశపు పౌరిడిగా కాక 
స్ట్రీట్ చిల్ద్రెన్ పేరుతొ కాందిశీకుల్లా బ్రతకాలని  


నాన్న వీపు సింహాసనం పై కూర్చున్న యువరాజులను చూసి 
నిలువ నీడ లేని బ్రతుకును పోల్చాలని  


పసి పిల్లలు వాళ్లకు ఏమి తెలుసు?


మానవత్వం కొంత చిగురించి 
ఒక్క మెతుకు తన పిడికేట్లో నుండి విదిలిస్తే 
చిన్నపోయిన బాల్యానికి గుండె గూటిలో చోటిస్తే 


సైకో కావాల్సిన బత్రుకు సైంటిస్ట్ లా చిగురిస్తుంది అని....
సంఘ విద్రోహిగా మారకుండా విజయాలు తెస్తుందని 
పసి పిల్లలు వాళ్లకు ఏమి తెలుసు?


మేధావులే తమ పుట్టుకకు కారణం అని 
ప్రజలు మారకుంటే ప్రభుత్వం ఏమి చెయ్యలేదని.....



Thursday 26 July 2012

ఆహా మహాలక్ష్మి వచ్చేసింది...పూజ కాక ముందే ....

ఆహా మహాలక్ష్మి వచ్చేసింది...పూజ కాక ముందే ....
సంతోషాల జల్లు తెచ్చేసింది.
ఒక చక్కని వార్త నా ''ఆత్మ సహచరులు''పుస్తక సమీక్ష 
పుస్తకం.నెట్ లో వచ్చినట్లు.
చాలా మంచి పుస్తకం యెంత వ్రాసినా ఇంకా చెప్పాలని అనిపిస్తుంది.
ఇంతే ఇంత కంటే నేనేమి చెప్పలేను చదవండి.

పుస్తక సమీక్ష లింక్sameeksha link ikkada     


అబ్బ వాన వాసన ....ఇంట్లో రేపటి వరలక్ష్మి పూజ కోసం 
పనులు చేసుకుంటున్న నాకు కమ్మగా తగిలింది....
రావే ఫ్రెండ్ బయటకు అని.....

బయట తల పెడితే చెట్లన్ని లాల పోసుకుంటూ ఇంకా పోయ్యమని 
సంతోషం తో తలలు ఊపుతూ ఉన్నాయి.బయటకు పొతే బురద కాని 
వరండాలో కూర్చొని వాన చూడటం అందులో .....
''అందని మిన్నే ఆనందం,అందే మన్నే ఆనందం.....
అరె భూమిని చీల్చుకు వచ్చే పచ్చని  పసిరిక ఆనందం''
వింటూ చూస్తుంటే....అబ్బ.

''ఏక వీర''లో పెద్దాయన ఏమి వర్ణిస్తాడు  శ్రావణ మాసాన్ని....
ఊరేగింపుకు వెళ్ళిన ఏనుగులను,పట్టు  చీరలు 
మొల్లలు,మల్లెలు,చామంతులు ఏమి కాంబినేషన్....
వచ్చేడపుడు తడిసి మద్ద అవుతుంటాయి   .....

అయినా ఆ అమ్మ కటాక్షం అంటే ఎవరికి ఇష్టం ఉండదు?
సాక్షాత్తు ఆ నారాయణుడే...
''కంటి శుక్రవారము ఘడియ లేడింట''చూస్తె వెళ్లి పొయ్యి 
ఉంటాడు.

సాక్షాత్తు శంకరాచార్యుల వారే ''కనకధారా స్తోత్రం''లో 
''అంగం హరే పులక భూషణ మాశ్రయంతి''అంటారు.
అమ్మను తలుచుకుంటే అయ్యకు పులకలు కలుగుతాయట.
అమ్మ...అమ్మ వెంట అయ్యా....
అందుకే అమ్మను పూజిస్తే అందులో ఈ రోజు ....
ఆ తల్లి దయామాయీ ....కరుణా కటాక్ష కృపా స్వరూపిణి ....
చేతులు జోడిన్చగానే వరాలను ఒసగే చల్లని తల్లి....
ఎప్పుడూ కాపాడుతూ ఉంటుంది.

(పూలల్లో,పాలల్లో,పసుపు గడపలలో,నవ్వుల్లో,పువ్వుల్లో 
అంతా చల్లని తల్లి.అందుకే ఇంట్లో ఆడవాళ్ళను ఏడిపించకూడదు.
అప్పుడే సుఖం,శాంతి,సంపద......నిలుచున్న లక్ష్మి దేవిని 
పూజించవద్దు వీలు అయినంతవరకు)

మరి మంత్రాలూ రాని వారు కనిసం ఈ పాట అయినా పాడుకొని 
పూజ చేసుకోండి.చాలు....తల్లిని తలుచుకుంటే చాలు...
చల్లని నవ్వులతో వచ్చేస్తుంది.




''సాయంకాలా సమయం లో ......సంధ్యా దీపారాదనలో 

వచ్చెను తల్లి మహా లక్ష్మి ......వచ్చెను తల్లి మహా లక్ష్మి 

పాల సముద్రిని పుత్రికగా ......పరంధాముని ప్రాణ సతి
రావమ్మా ఇక రావమ్మా....మమ్మేలగా ఇక రావమ్మా 

విద్యను ఇచ్చే విద్యా లక్ష్మి .....సంతానం ఇచ్చే సంతాన లక్ష్మి 
సౌభాగ్యం ఇచ్చే సౌభాగ్య లక్ష్మి.....ధైర్యం ఇచ్చే ధైర్య లక్ష్మి 

మెడలో ఎన్నో హారాలు ......సిగలో ఎన్నో పుష్పాలు 
నవ్వుచు వచ్చెను నా తల్లి.......నను కరుణిమ్చెను  నా తల్లి 

వరములను ఇచ్చే వర లక్ష్మి......ధాన్యం ఇచ్చే ధాన్య లక్ష్మి 
ధనమును ఇచ్చే ధన లక్ష్మి ......విజయమును ఇచ్చే విజయ లక్ష్మి 

కాళ్ళకు గజ్జెలు కట్టింది ....మెడలో హారం వేసింది 
పిలిచిన వెంటనే పలికింది ......అడిగినదంతా ఇచ్చింది 

సాయంకాలా సమయం లో.....సంధ్యా దీపారాధన లో 
వచ్చెను తల్లి మహా లక్ష్మి....వచ్చెను తల్లి మహా లక్ష్మి ''


వ్రాసిన వారు: తన్నీరు శశికళ
********
ఇది రిచార్డ్ బాక్ (Richard Bach) చేత వ్రాయబడిన వన్ (One) కి తెలుగు అనువాదం. దీనిని మహేంద్రవర్మ గారు అనువదించారు. ఇది సమాంతర కాల జీవనాలను, ప్రత్యామ్నాయ జీవిత కాలాల గూర్చి బాగా వివరిస్తుంది. మనం మన జీవితం లోని వివిధ ఘట్టాలలో మన ఎంపిక దారుల వలననే ఇలాగా జీవిస్తున్నాము అని చాలా చక్కగా ఉదాహరణనలతో వివరిస్తుంది.
కాలం గూర్చి కూడా బాగా చెప్పుతారు దీనిలో.నిజానికి అంతా వర్తమానమే తప్ప గతించిన కాలం,భవిష్యతు లేదు.మనం ఎక్కడకు కావాలంటే అక్కడకు వెళ్లి చూడొచ్చు.దీనిని అర్ధం చేసుకోవాలంటే కొంచం కష్టమే. కాని ఇక్కడ ఇచ్చిన బాక్,లేస్లి జీవిత ఘటన ల ద్వారా మనకు చక్కగా అర్ధం అవుతుంది.
ముందుగా లేస్లి,బాక్ తమ సొంత విమానం లో ప్రయాణం చేస్తూ విమానాశ్రయం వారిని ల్యాండింగ్ కు పర్మిషన్ అడుగుతూ ఉంటారు.అప్పుడు లెస్లీ నే విమానం నడుపుతూ ఉంటుంది. ఉన్నట్లుండి బంగారు రంగు కాంతి కనపడి దాని తరువాత వారు నగరం పై మాయమై ఒక సముద్రం పై ఎగురుతుంటారు.దానిలో కింద చాలా అల్లికలు కనిపిస్తాయి వల లాగా. అవి కలుస్తూ దూరంగా పోతూ ఒక వల లాగా అల్లుకొని ఉంటాయి. తర్వాత వారు అవి తాము వచ్చిన జీవిత గమనాలు అని అవి కలిసే దగ్గర రెండు రకాల ఎంపికలు మనం చేసుకోవచ్చు అని తెలుసుకుంటారు.ఇంకా తాము ఎక్కడకు గతం లోనైనా,భవిష్యత్తు కైనా వెళ్లి చూడొచ్చు అని తెలుసుకుంటారు.
ఉదాహరణకి లేస్లి,బాక్ వారు కలిసిన మొదటి క్షణాలకు వెళుతారు. అప్పుడు వాళ్ళే వాళ్లకు యవ్వనం లో కనిపిస్తుంటారు. నిజానికి వాళ్ళు ఇద్దరు ఒకరికి ఒకరు అడ్జస్ట్ అవ్వటానికి చాలా టైం వృధా చేసి ఉంటారు. కాబట్టి వాళ్ళ యవ్వన శరీరాలకు మీ ఆత్మ సహచరులను వదులుకోవద్దు. ఎందుకు కాలం వృధా చేస్తారు? వెంటనే కొన్ని కోరికలు వదులుకొని పెళ్లి చేసుకోండి అని కలుపుతారు. అలా తమకు వృధా అయిన కాలాన్ని వాళ్ళు వృధా చేసుకోకుండా చూస్తారు.
ఇంకా వీళ్ళు గతం లో భవిష్యత్తు లో చాలా ఘటనల దగ్గరకు వెళ్లి వాళ్ళ ఎంపికలు మార్చుకుంటే ఎంతో వినాశనాన్ని ఆపొచ్చు అనే ఆలోచన వాళ్ళలో కలిగిస్తారు.
వీళ్ళు ఒక ఎంపిక పై దిగినపుడు ఒక వ్యక్తి తపస్సు చేసి ఒక పుస్తకం సాధించటం చూస్తారు. వీళ్ళు చూస్తుండగానే ఆతను దానిని మంటల్లో వెయ్యబోతాడు. వీళ్ళు వెళ్లి అతనిని ఆపుతారు. “ఎందుకు అలా చేస్తున్నారు మీకు ఏమైనా పిచ్చా?” అని అడుగుతారు. అప్పుడు వాళ్ళ మధ్య సంభాషణ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ బుక్ ఉంచితే ఏమి అవుతుంది అని అడుగుతాడు. చాలా మంది చదువుతారు. అప్పుడు ఒక మతం ఏర్పడుతుంది. అది గొప్పది అనే వాదన మొదలు అవుతుంది. తరువాత యుద్దాలు, అవసరమా … ఇదంతా అని వివరించి బుక్ ని మంటల్లో పడేస్తారు. ఇలా ఒక ఎంపిక వలన మన జీవిత గమనం ఎలా మారుతుందో చాలా ఉదాహరణలు ఉన్నాయి.
అసలు మనం లేస్లి,బాక్ లతో ప్రయాణిస్తూ అవన్నీ దగ్గర నుండి చూసినట్లు అనిపిస్తుంది. ఖచ్చితంగా ఈ పుస్తకం చదివిన తరువాత మన జీవితం మన ఎంపికల పలితమే అని ఇలాంటి వర్తమానాలు చాలా ఉన్నాయని గ్రహిస్తాము.మన ఆలోచనలలో చాలా మార్పు వస్తుంది.
కాని ఈ సమాంతర కాలం అనే భావన అర్ధం చేసుకోవటం కొంచం కష్టం గానే ఉన్నప్పటికీ అర్ధం చేసుకుంటే మన జీవితం మంచి మలుపు తిరుగుతున్దనటం లో సందేహమే లేదు.
ఈ రిచర్డ్ బాక్ వ్రాసిన జోనాథన్ సీగల్ పుస్తకం మనలో చాలా పాజిటివ్ యాటి ట్యూడ్పెంచుతుంది.
ఆత్మ సహచరులు పుస్తకం నుండి కొన్ని మంచి వాక్యాలు
”ప్రేమ తత్వాన్ని నువ్వు తెలుసుకున్నప్పుడు ఇక ప్రతి క్షణం నీవేమి నేర్చుకుంటావో ఆ అనుభవం తో నీ ప్రపంచాన్ని మార్చుకోగల శక్తి నీకు వస్తుంది”
”విశ్వ చిత్రం లో ఎక్కడకు వెళ్ళినా మీరు ఇద్దరు కలిసే వెళుతారు. ఏ మూల నుండి చూసినా ఒకరు మరొకరి ప్రేమ సంరక్షణలో ఉంటారు.”
”నీకు ఆమె శక్తి కావాలి.ఆమెకు నీ చోదన సామర్ధ్యం కావాలి. మీరు ఇద్దరు కలిస్తేనే గగన విహారం సుసాధ్యం”
అసలు ఈ పుస్తకాన్ని చదివి అనుభూతి సొంతం చేసుకోవాలి అంతే.యెంత చెపినా తక్కువే.
ప్రతులకు చిరునామా:
house.no.16-11-477/6/1/A-6
andhrabank A.T.M.counter,
beside sahadev reddy sweet house,
dilshuknagar,
hyderabad,phone -040 66637630,9290125886.


pustakam.net
http://pustakam.net/?p=11949

Monday 23 July 2012

మణులు అడిగానా?మాన్యాలు అడిగానా?



''కేవ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్''రూం అంతా ప్రతిద్వనించింది.


''అబ్బ చిన్నగా అరువు...నీ తొక్కలో ఫ్లాష్ బ్యాక్ కి 
ఇంత  బిల్డ్ అప్ ఎందుకు ?''


ఆఫీస్ లో దిగులుగా కళ్ళు మూసుకొని కూర్చున్న మూర్తిని 
పనిమాలా కెలికినందుకు తన మీద తానె జాలి పడుతూ 
అడిగాడు పణి.
మరి నేను కూడా  ఆ లెవెల్ లో అరిచాను మా ఆవిడ కోరిక విని ....


ఒక్క సారి రయ్యుం....రయ్యుం...రయ్యుం....నిన్న రాత్రికి 
వెళ్లి పొయ్యాడు.


''ఏమండీ''....''చెప్పండి''
''ఏమండీ''ఇంకా గోముగా....
ఎక్కడో నక్క ఊల వినిపించింది.....ఎడమ కన్ను ఆదరసాగింది.
ఛీ...ఛీ....అవన్ని అబాద్దాలు,శకునాలు నమ్మకూడదు అని 
మనసులో అనుకొని...అయినా రెండు సార్లు పిలిచిందంటే 
కొంప మునిగే మాటే ......అయినా వానొస్తే మునిగే కుంటల్లో 
ఇల్లు కట్టుకునే వాళ్ళే బయపడకుండా ఉంటున్నారు .
నా కొంప ఎలా మునుగుతుంది అనుకొని .....చెప్పమన్నట్లు 
చిన్నగా తలూచాడు ....మెల్లని మందహాసం విష్ణు మొర్తిలాగా 
ఒలికిస్తూ(అసలు పేరు అదే)


వెంటనే లక్ష్మి దేవి కాళ్ళ దగ్గరకు వెళ్లి పొయ్యింది.....
మెల్లిగా కాళ్ళు  ఒత్తుతూ  ....అనసులో మాట బయట పెట్టింది.


వెంటనే న్యూక్లియర్ బాంబ్ పడినట్లు ఉలిక్కి పడ్డాడు.
అడ్డంగా ,నిలువుగా నానా రకాలుగా తల ఊగించాడు 


విచ్చుకున్న యెర్ర పెదాలు....సున్నాలా మారిపొయ్యి 
మూతి మూడు వంకరలు తిరిగింది.
''మణులు అడిగానా?మాన్యాలు అడిగానా?''
నిష్టూరాలు.....చక్కని రాత్రి వృధాగా ఎందుకు...
ప్రస్తుతానికి శాంతి ఝండా ఎగరేశాడు ....రేపు వాకాబు చేస్తాను అన్నాడు.
(మనసులో మన్మోహన్ లాంటి దిగులు పెట్టుకొని)


''వాకబు చెయ్యటం కాదు ,సాధించాలి''సుప్రీం కోర్ట్ ఆర్డర్.


రయ్యుం...రయ్యుం..ఇప్పటి కాలానికి 


సరే ఇంతకీ కోరిక ఏమిటి అడిగాడు కొంచం జాలి,కొంత విసుగు కలిపి 
పెరుగులో జాం కలుపోకొని తినే మొహం పెట్టి.....


''ఏముంది .....గోరింటాకు కావాలంట,శ్రావణ మాసం పెట్టుకోవాలి అంట''


''ఓస్...దాని దేముంది హెన్నా కోన్ ఒకటి కొనిచ్చేయ్యి''అన్నాడు పణి .


''మరదే నీకు తెలీని విషయం నిజం గోరింటాకే పెట్టుకోవాలంట.
అది పెట్టుకుంటేనే లక్ష్మి దేవి ఆశీర్వాదిస్తుంది అంట.పైగా 
మీ కోసమే కదా ఈ వ్రతాలు అని సెంటిమెంట్''


''హూ కష్టమే పదా పర్మిషన్  పెట్టి వెదుకుదాము''చెప్పాడు స్నేహ ధర్మం తో.


అప్పుడు మొదలైంది వాస్కోడిగామా ఇండియా కనుక్కొనే ప్రయాణం....
అదిగో అక్కడ ఉంది అంటారు ,తీరా  వెళితే అపార్ట్మెంట్స్  కట్టేసి ఉంటారు.
అలా అలా అడుగుతూ  సుదూర తీరాలకి వెళ్లి పొయ్యారు...అంటే నగరం 
పొలిమేరలకు.


''లాభం లేదు బాస్ ....పల్లెల్లో కూడా సెజ్ ల పుణ్యమా అని ,రింగ్ రోడ్లు 
అని ఎక్కడా చెట్లు ఉండవు''నిరాశగా చెప్పాడు ఫణి 


ఏమిటి దారి దిగులుపడుతూ దీనంగా మొహం పెట్టాడు మూర్తి 
పింక్ కార్డ్ అందుకున్న సాఫ్ట్ వేర్ లాగా....రాత్రికి తలుపు తియ్యక 
పొతే ఎక్కడ ఉండాలి అని ఆలోచిస్తూ.....


''హేయ్...హేయ్''ఎక్కడో బర్రెలు తోలుకుంటూ వచ్చాడు గోపాలకృష్ణుడు .
''బాబ్బబ్బా   ...బ్బు...'అని వెంటపడ్డారు తరుణోపాయం చెప్పమని.
చిన్నగా నవ్వి హైవే వైపు వేలు చూపించాడు.


నిజమే సుమీ...ఎందుకు రాలేదు ఇంత మంచి ఐడియా....
జామ్మని వెళ్లి పొయ్యారు ......డివైడర్ మీద కాగితం పూల 
చెట్లు వీళ్ళ హుషారు చూసి మెల్లిగా తలలు ఊపాయి 
ఆహ్వానిస్తున్నట్లు.....


వాటిని దాటగానే కనిపించాయి ....గోరింటాకు చెట్లు డివైడర్  మీద.
వజ్రాల ఘని చూసినట్లు వెలిగిపోయ్యాయి ఇద్దరి మొహాలు.
సర్రున దూసుకెళ్ళి....కోసుకోచ్చేసారు......
               @@@@@@@@@@@@@


అన్నం తిని టి.వి.చూస్తూ కూర్చుని ఉంటె మెల్లగా చేతి వేళ్ళ స్పర్శ 
కళ్ళు మూస్తూ....కమ్మని గోరింటాకు వాసన వేళ్ళ నుండి 
అద్భుతంగా ఉంది....చేతులు తియ్యమనకుండా ఆగ్రాణిస్తూ 
కూర్చున్నాడు.


మెల్లిగా చేతి వెళ్ళు నిమిరి గర్వంగా అన్నాడు ....
''చెప్పు ఈ సారి ఏమి తెమ్మంటావు?''


కిలకిల  నవ్వులకు,గాజుల సంగీతం తోడై టి.వి పాటలో 
కలిసిపోయింది.


''పంచ వన్నె చిలుకా జలకాలాడగా మంచు బిందువులు సేకరిస్తా 
దేవత స్నానం చేసిన జలము గంగా జలముగా సేవిస్తా...''

Wednesday 18 July 2012

స్నేహానికి యెంత విలువ....

స్నేహానికి యెంత విలువ ఉంది నిజంగా అందుకే
ఆద్యాత్మికత లో కూడా  దాన్ని అంత బలపరచారు.

ఒక నాటకం లో పోర్శియా  అంటుంది"దయ అనేది
వానలా మెల్లగా స్వర్గం నుండి కురుస్తుంది.అది
ఇచ్చిన వాళ్లకి,స్వీకరించిన వాళ్లకి కూడా సంతోషం
కలిగిస్తుంది " అని.......

స్నేహం  కూడా అంతే.ఎందుకో కొందరిని చూస్తె కొత్తగా
అనిపించదు.పై పెచ్చు ఎన్నో రోజుల నుండి వాళ్ళను
ఎరిగినట్లు ఉంటుంది.

ఇప్పుడే పరమహంస యోగానంద వారి విదేశాలలో చెప్పిన
ప్రసంగాల వ్యాస సంపుటి చదివాను.యెంత చక్కగా ఉందొ
స్నేహం గూర్చి.....

మచ్చుకి కొన్ని.....
''ఎవరి పట్ల అయినా నీకు దివ్యాకర్షణ కలిగితే వారితో స్నేహం చెయ్యండి.
ఏదో పూర్వ జన్మలో వారు మీకు స్నేహితులై ఉంటారు''

''హృదయపూర్వకంగా బేషరతు అయిన ప్రేమను వ్యక్తం చేసే
అవకాశాలు కల్పించటానికి అయన స్నేహితుల రూపంలో
వస్తాడు''

''నేను అందరికి మిత్రున్ని...నా శత్రువులకు కూడా...
అని చెప్పే స్తితి నీలో రావాలి''

''స్నేహం కోసం మీ కోరిక తగినంత ఉంటె ,మీతో ఆద్యాత్మిక అనుసంధానం
కలిగిన వ్యక్తీ దక్షిణ ద్రువం వద్ద ఉన్నా స్నేహం అనే అయస్కాంత
శక్తి మీ ఇద్దరినీ ఒక చోటికి ఆకర్షిస్తుంది''

ఇలాగే ఎన్నో మంచి విషయాలు.....చదవండి.....కొన్ని ఇస్తున్నాను.







Saturday 14 July 2012

ఎక్కడకు వెళుతున్నాం?ముందుకా...వెనక్కా...

ఈ రోజు సాక్షి లో సంపాదకీయం చదివాను.
ఒక గ్రామం లో ఆడవాళ్ళపై చేసిన కట్టడి,అల్లరి మూకలు 
మహిళలపై చేసిన ముట్టడి చదివాను.
ఏమిటిది మళ్ళా ఆటవిక దశకు వెళ్లి పోతున్నామా?


యెంత చదువుకున్నాము....యెంత సంస్కారం నాగరికత 
నేర్చాము.చదువురాని వాళ్ళు గౌరవం ఇచ్చినంత మాత్రం 
మహిళకు గౌరవం బధ్రత ఇవ్వలేక పోతుంటిమె...హ్మ్ ...
ఎందుకొచ్చిన చదువు?


నేను ఒక సారి మా ఊరి స్కూల్ పిల్లలు సముద్రం దగ్గర లైట్ హౌస్ 
చూడటానికి పోతుంటే వాళ్ళ టీచర్స్ తో పాటు నేను కూడా వెళ్లాను.
మా ట్రాక్టర్ చెడిపోయి ఒక సముద్ర తీర గ్రామం లో రాత్రికి ఉండాల్సి వచ్చింది.
అప్పుడు వాళ్ళ మంచి మనసు,ఆతిధ్యం రుచి చూసాము.


అలాగే వాళ్ళ కట్టు అంటే యెంత కటినంగా ఉంటుందో చూసాము.
వాళ్ళు అప్పటికి అప్పుడు వెలివేస్తే ఒక కుటుంభం ఆ ఊరి వదిలి 
వెంటనే వెళ్లి పొయ్యారు.


ఇంత  మంచి కట్టుని ఆ సముద్ర గ్రామాల వాళ్ళు ఆ ఊరికి 
కరంట్,రోడ్లు,స్కూల్స్ అలాటివి తెచ్చుకోవటం లో 
వాడుకుంటే యెంత బాగుంటుంది కదా......



Friday 13 July 2012

సత్యభామ సరదాలు 1

నారాయణులవారు సాయంత్రం చక్కగా ఫ్యాన్ కింద 
కూర్చొని పేపర్ చదువుతూ టి.వి.వీక్షిస్తున్నారు.
కొన్ని పూలు చిన్న గిన్నె లో వేసుకొని దారం తీసుకొని 
పక్కన నెల మీద కూర్చుంది లక్ష్మీదేవి.....పూలు కడదామని.
(దేవుళ్ళు కాదు మీరు పొరబడవద్దు.అన్నీ కల్పితాలే)

పిల్లలు రెండు రోజులు సెలవలు వస్తే అమ్మమ్మ గారి ఇంటికి 
వెళ్లారు.అందుకు ఇల్లాలికి పనిలో కొంచం వెసులుబాటు.
శ్రీవారికి కొంచం ప్రశాంతత.

మెల్లిగా మల్లెపూలకి కాడలు తీసేస్తూ టి.వి లో చూసింది.
ఎక్కడో లక్ష్మిదేవిని చూపిస్తూ ఉన్నారు.''ఇదిగో విన్నారా?''

''ఏమిటి?''పేపర్ లో నుండి కళ్ళు మాత్రం బయటపెట్టాడు.

''వచ్చే వారమే శ్రావణ్ శుక్రువారం''మెల్లిగా బాంబ్ పేలింది.
ఉలిక్కి పడ్డాడు.అసహనంగా కదిలాడు.''అప్పుడే వచ్చిందా?''
విసుగ్గా గొణిగాడు.ఎన్ని భావాలు చూపించినా అర్జీ పైన 
వాళ్లకు పంపించిన కింద ఆఫీసర్ లాగా నిమ్మళంగా ఉంది 
పూల కాడలు తల వంచుకొని వలుచుకుంటూ....

''ఇదిగో ఇప్పుడు చీరలు నగలు మాట ఎత్తకు...నీకే 
చెప్పేది....అసలు నెలాఖరు వంద సంగతి దేవుడెరుగు ...
పది రూపాయలు కూడా లేవు.తల పక్కకి తిప్పి చూస్తూ చెప్పాడు.

ఏమి చలనం లేదు.నల్లని కురుల మధ్య తల వంచుకొని 
వర్షించ బొయ్యే శ్రావణ మేఘాల్లా......

''సరే...సరే ఎప్పుడు వచ్చే పూజలను ఎందుకు కాదు అనటం 
రెండు వందల్లో ఏదైనా చీర తెచ్చుకో .....పక్కకు ఓరగా చూసాడు.

ఊహు....ఏమి మార్పు లేదు.తల కొంచమైనా ఎత్త లేదు.
చక్కటి పొడవైన వేళ్ళు చురుకుగా పూలను దారంతో 
బందిస్తూ తమాషాగా కదులుతున్నాయి.
చక్కటి కూచిపూడి నృత్యం చూసినట్లు కాసేపు తమకంగా 
చూసాడు.

''సరే....సరే నిజమేలే .....ఏమి వస్తున్నాయి రెండు వందలకు ,
ఐదు వందలలో కొనుక్కో ''

ఊహూ మౌనమే సమాధానం.సంపెంగ లాంటి ముక్కు చివర 
తెల్ల రాయి ముక్కు పుడక మాత్రం తళుక్కుమన్నది....మదిని 
మురిపిస్తూ......

''ఎలా వేగేది మీతో.ఎక్కడ నుండి తేను డబ్బులు ఇక్కడ 
చెట్లకు కాయటం లేదు.సంపాదిస్తే తెలుస్తుంది అది యెంత 
కష్టమో....మీ నాయన నాకేమి మూటలు ఇవ్వలేదు ....
నీ కోరికలు తీర్చటానికి''మధ్యతరగతి అక్కసు సెగలు కక్కింది.

చురుక్కున తగిలాయి చూపులు ......కాల్చేస్తున్నాయి 
యెర్రని కళ్ళ నుండి తూటాల్లాగా......పై చేయి  కిందికి  పోయింది.

మాట తడబడ్డాడు...అది...అది...కాసేపు నీళ్ళు నమిలాడు.
నిజమే మాట తూలాను ఎలా ....అనుకున్నాడు.
సన్నజాజుల వేళ సరదాగా ఉండాలి కాని సెగల పొగలు 
ఎందుకు...చల్లార్చాలనుకున్నాడు.

''అది కాదు ....ఎలాగో డి.ఏ.పెరిగింది.వెయ్యి రూపాయలలో 
చీర కొనుక్కో .....షాప్ అతనితో వచ్చే నెల ఇస్తామని చెప్పు.''

ఇంకా మౌనమే ....కాకుంటే తల చిన్నగా ఊగింది 
రైలు కోసం పచ్చ జండా మొదట మెల్లగా ఊపటం మొదలు పెట్టినట్లు.

హుషారు వచ్చింది దొర గారికి....ఇంకొంచెం ....ఇంకొంచెం....
మాటలు పొడిగించాడు.''ఎలా ఉండాలి చీర ....నువ్వు పూజలో 
కట్టుకుంటే అంత మందిలో దేవ కాంత లాగా వెలిగి పోవాల...
పర్లేదు ఇంకో రెండు వందలు ఎక్కువైనా....నువ్వు 
మాత్రం కాకి ముక్కులో వజ్రం లా వెలిగి పోవాలా''

కవిత్వం ఏదో చెప్పెస్తున్నట్లు గొప్పగా పోగిడేసి స్వర్గానికి 
తీసుకు పోతున్నట్లు చెప్పాడు.

మౌనం వీడింది.పగడాల దీవిలో ముత్యాల సరం లాగా నవ్వు 
తళుక్కున విచ్చి పుటుక్కున  మాయం అయ్యింది.చేతిలో పూల దండ 
పూర్తీ అయ్యింది.

మెల్లిగా లేచింది.నారాయణుల వారు ఇంకా వరాలు ఇచ్చే మూడ్  లోనే 
ఉన్నారు.''ఇంకా యెంత కావాలో చెప్పు వ్రతానికి ,గాజులకి,పూలకి 
అంతా ఇచ్చేస్తాను.నువ్వు మాత్రం మా ఇంటి మహా లక్ష్మి లాగా 
నవ్వుతూ తిరుగుతూ పాల సముద్రం చేసెయ్యాల''

పక పక నవ్వుతూ నవ్వులతో పాటు దండ ను కూడా అతని 
దోసిలిలో జార్చి మనసుని నింపేసింది.
''వీటి కేమి తక్కువ లేదు''నవ్వుతూ అంది.
''మరి వేటికి తక్కువో''ఓర చూపులతో అడిగాడు.

ముసి ముసి నవ్వులతో వెనక్కి తిరిగింది జడను అందిస్తూ.
మాలను జడ లో తురిమి మురిసిపోయాడు....పొతే పోయిందిలే 
వెదవ డి.ఏ.ఇంత ఆనందం ఏమి చేస్తే వస్తుంది.

వివాహ చట్టం లో లేక పోయినా వచ్చే హక్కుతో పూలు పెట్టి 
పరిమళాల జల్లులో తడిసిపోయాడు.

Thursday 12 July 2012

ఎలాగున్న సంతోషంగా ఉండాలని అనుకుంటే....

''నువ్వు ఎలా ఉన్నా సంతోషంగా ఉండటానికే 
నిర్ణయించుకొని జీవిస్తుంటే అదే ధ్యానం ''......ఓషో.

ఇపుడే సాయంత్రం ఆరు నుండి ఏడు వరకు మొత్తం 
దేశం లో గల అన్ని పిరమిడ్ ధ్యాన కేంద్రాలలో ఉన్న 
అందరం కలసి సామూహిక ధ్యానం చేసాము.
సంకల్పం ఏమిటంటే దేశం లో సకాలం లో సరిగా వర్షాలు పడాలి.
అది పత్రీజి గారి మేస్సేజ్.బహుశా మాస్టర్స్ ఎవరైనా 
ఆయనకు ఇచ్చి ఉంటారు.
ఇంత కంటే మంచి అవకాశం రాదులే ....
ఒక మంచి సంకల్పం తో గంట ఉండటానికి అని వెళ్లి వచ్చాను.

మనకు మన జీవితం లో కొన్ని విషయాలు లేక 
వ్యక్తులు నచ్చక పోవచ్చు.కాని అవన్ని మనకు సమతుల్యతలోనే 
ఉన్నాయని అవి మనకు మంచి చేస్తాయి అని భావిస్తే 
జీవితం చాలా ప్రశాంతంగా హాయిగా ఉంటుంది.అప్పుడు జీవితం ఎలాగా 
ఉంటుందంటే ''కమ్మని పాటకు రూపం వస్తే అది నీలాగే 
ఉంటుందని ''అని సంతోషంగా అన్ని ఇబ్బందుల్లో కూడా 
పాడుకోగలం.

ఇబ్బందిని కూడా మన జీవితం లోకి ఎలా తీసుకోవాలో 
వివేకానందుని కధలో ఉంది.
దక్షిణేశ్వరం లో పంచవటి అనే చోట వివేకానందుల వారు 
ధ్యానం చేసుకొనే వారు.అక్కడ సాయంత్రం సైరన్ మోగేది పెద్దగా.
దాని వలన అతనికి ధ్యాన భంగం అయ్యేది.

ఒక సారి రామ కృష్ణుల వారితో చెప్పుకొని బాధ పడ్డారు.
అప్పడు రామ కృష్ణుల వారు''ఆ శబ్దాన్ని కూడా నీలోకి తీసుకో 
అప్పుడు అది నిన్నేమి చెయ్యలేదు'' అన్నారు.
అలాగే ఆయన చేసారు.
మనం కూడా  ఇబ్బంది కరం అనిపించేవి మనలో 
తీసుకుంటున్నాము అనుకొని ....వాటి నుండి వచ్చే 
పాఠాలు నేర్చుకుంటే అవి మనలను ఏమి చెయ్యవు.

మీ కోసం ఓషో గారి బుక్ ''నిత్య జీవితం లో ధ్యానం ''
నుండి కొన్ని పేజెస్....... 





Wednesday 11 July 2012

రాజ ''కీ''యాలు.....చిదంబర రహస్యం


  రాజ ''కీ''యాలు.....చిదంబర రహస్యం 
రూం అంతా వేడిగా పొగలు సెగలుగా నిండి పోయి ఉంది.
పెద్ద మేడం హాట్ హాట్ గా ఉండేసరికి పార్టి పెద్ద తలకాయలు 
నోట్లో సెంటర్ ఫ్రెష్ ఉంచుకొని గప్చిప్.....

చెప్పండి ....ఎందుకిలా అన్ని వైపులా ఓటమి ...
పార్టీయే మునిగేలా ఉంది.ఏదో ఒకటి చెప్పక పోయారో 
మీ బతుకు బస్సు స్టాండే....పొండి :పొయ్యి ఎలుకను తవ్వి 
కొండను పట్టుకు రాపొండి".

ఏమిటి సామెత కూడా పార్టీ లాగా తిరగ బడిందే  అనుకోని 
మనకు ఎందుకు ....మళ్ళా జాలిం లోషన్ తో పని 
అనుకోని తలలు అన్ని కోణాల్లో ఊగిస్తూ వెళ్లి పొయ్యారు.

మూడు రోజులు  తలకిందులుగా ఆలోచిస్తే మోకాల్లో మెదడు కొంచం 
యధాస్తానానికి వచ్చి ఆలోచించింది.అన్ని లుక లుక తమ వైపే ...
ఇది కాకుండా చిన్న సార్ కూడా ఇందులో వేలు పెట్టాడు.
దెబ్బకి "నా బంగారు పుట్టలో వేలు పెడితే కుట్టనా '' అని ప్రజలు 
పార్టీని కుట్టేసి ముక్కలు  చేసేసారు.ఈ విషయం పెద్ద మాడం కి చెపితే 
ఇంక ఏమైనా  ఉందా?

పాయింట్లు  అన్నీ తిరగేసి మరగేసి చూసారు వేరే వాళ్ళ మీదకు నెపం 
తోయ్యటానికి.....అందులో ఒక పాయింట్ కనిపించింది ఓటమికి. 
పెరిగిన ధరలు.

అయితే పెరిగితే మాత్రం దానికి తగ్గట్లు జీవించాలి కాని ఎందుకు అరవటం 
ఈ జనాలు....అసహనం గా  అరిచాడు ఒక చిదంబర తలకాయ.
అవును ఈ జనాలింతే.....యెంత రెట్లు పెరిగినా ఏ రోజైనా వోట్లేసే రోజు 
పంచుతూ ఉండే  సారా తగ్గించామా?
హూ...సకిలించాడు  ఇంకో పెద్ద తలకాయ.

అందుకే ఆయనెవరో అన్నాడు ''ఆసియా ప్రజలు తిండితోనే ఆహార 
కొరత అని....వీళ్ళు అంత అంత తినటం ఎందుకు ?ధరలు పెంచటం 
ఎందుకు?మనం పెంచాము అనే నింద మనకు ఎందుకు?''

చిదంబర తలకాయ కి ఇంకో మంచి ఆలోచన వచ్చింది.''యురేకా''
అరిచాడు గట్టిగా....దెబ్బకి అందరు అదిరిపడి తమ పంచెలు 
గట్టిగా పట్టుకొని ఆయన పంచె వైపు చూసారు....ఎక్కడ ఆనందంతో  
వీధి లోకి పరిగేడుతాడో అని ....హమ్మయ్య క్షేమం అని అనుకోని 
కారణం సెలవు  ఇయ్యమని వినయంగా అడిగారు 

చిద్విలాసంగా నవ్వి ''అసలు ఈ పేదలతో మనకు కష్టం లేదు.
వాళ్ళు తాగేది గంజి.గోప్పోళ్ళ తో కష్టం లేదు.వాళ్ళు బెంజి లో 
తిరిగినా సమయం లేక తినేది బ్రేడ్డే....వీళ్ళిద్దరికీ మన గూర్చి 
ఆలోచించే తీరిక అరిచే ఓపికా ఉండవు.

రేపు నేను మీడియా కి ఇచ్చే స్టేట్మెంట్  చూడండి....దెబ్బకి 
ధరల పెరుగుదల నింద మనపై లేకుండా పోతుంది.
మేడం కూడా చిన్న బాబు పై నింద వెయ్యనందుకు మెచ్చుకుంటారు అన్నాడు.

పక్క రోజు వార్త....''అసలు ఈ మధ్య తరగతి వాళ్ళ వల్లే ధరలు 
పెరుగుతున్నాయి(అంటే పెరిగినట్లు అందరికి తెలుస్తున్నాయి)
ఏమి బియ్యం ఒక్క రూపాయ పెంచితే మీ సొమ్ము ఏమి పోతుంది 
గలబా...గలభా...ఏమి ఐస్ క్రీంలు తినటం లేదా ?మినెరల్ వాటర్ 
తాగటం లేదా?ప్రభుత్వం కోసం ఈ మాత్రం అన్నింటి పైనా ఒక్క 
రూపాయి ....ఒకే ఒక్క రూపాయి పెంచాలేరా?

నిద్రపోతున్న చిదంబర తలకాయ ఆత్మని లేపి అడిగాడు 
అపరిచితుడు.....ఒక్క రూపాయ మీకిస్తే మా సొమ్ము పోతుందా?
పోదు చెప్పాడు...ఛి.త.......వంద రకాలపై ఒక్క రూపాయ మీకిస్తే 
మా సొమ్ము పోతుందా? పోదు...ఛి.త 
వంద కోట్లు మంది ఒక్కో రూపాయి,ఒక్కో వస్తువు మీద ఇస్తే 
సొమ్ము పోతుందా?

చిదంబర తలకాయ నవ్వింది....పోదు...ఎక్కడికి ...
స్విస్ బ్యాంక్ కి తప్ప......హ...హ...హ...
అంతే మధ్యతరగతి అపరిచితుడు....డమాల్ అని స్పృహ తప్పి పడి పొయ్యాడు.

చిదంబరం గారికి.....ఏదో మీ పుణ్యమా అని సాదారణ గృహిణిగా 
ముచ్చట్లు వ్రాసుకునే నేను ఇలా ''రాజ'కీ' యాలు'' వ్రాసుకొనే 
స్టేజ్ కి వచ్చాను.ఇలాగే నన్ను అభివృద్ధి చేసి ఏదో ఒక ఊరికి 
ఎం.ఎల్.ఏ.చెయ్యగలరని ప్రార్ధన.

Saturday 7 July 2012

ఇల్లాలి ముచ్చట్లు 1

చిన్నప్పటి ముచ్చట్లు చెప్పుకోవాలి అని ఎవరికైనా 
అనిపిస్తూ ఉంటుంది.మరి సాక్షి లో ఇలాటి అవకాశం 
వస్తే వదులు కుంటామా?


సాక్షి ఫ్యామిలి లో నా ఇల్లాలి ముచ్చట్లు బుధవారం (4/7/2012)
వచ్చింది చూడండి.


ఇది నేను పంపింది.వారు కొంచం తగ్గించారు.


THANKYOU SAKSHI 


సాక్షి లింక్ ఇక్కడ.....




మొక్క జొన్న పొత్తులున్నాయి తిందువా.......సన్నగా పాట వినిపిస్తుంది దూరంగా...
నిజం గానే వాతావరణం అలాగే నల్లగా మబ్బెసుకొని .....చల్లటి గాలి చెంపలు నిమురుతుంటే...
రోడ్డు పక్కన నుండి కాలుతున్న  మొక్క జొన్న  వాసన 
ముక్కు పుటాల గుండా వెళ్లి ఆషాడం పెళ్లి కొడుకులా ఆగమని గునుస్తూ ఉంది.
లాభం లేదు తినాల్సిందే.బండి దగ్గర మొక్క జొన్న కాలుతున్న వాసన ,కింద వేడిగా 
కాలిన బొగ్గుల వెచ్చదనం చుర చురమనే జ్ఞాపకాలలోకి తీసుకెళ్ళి పోతున్నాయి.

కుంపటి ఇంట్లో ఉన్నా  దానితో ప్రత్యక్ష అనుభవం ఆరో క్లాస్ లోనే.
అమ్మ ఊరికి వెళ్లిందని అక్క వంకాయ కూర బొగ్గుల కుంపటి 
మీద పెట్టి చూస్తూ ఉండమని ఫ్రెండ్ ఇంటికి వెళ్ళింది.
నేను బుద్దిగా చూస్తుండి పొయ్యాను.అక్క ఇంటికి వచ్చిన 
తరువాత కరునేక్కిన కూర  చూసి ఎరుపెక్కిన తిట్లు వేడిగా పడిన తరువాత కాని 
తెలీలేదు.....చూస్తూ ఉండటం అంతే నిప్పులు అప్పుడప్పుడు కలబెడుతూ, 
బొగ్గులు వేస్తూ రాజుకోవటానికి అప్పుడప్పుడు విసన కర్రతో విసరాలి అని.

అసలు కుంపటి వెలిగించటం అంతే ఒక తపస్సు.
ముందు మధ్యలో ఒక పిడక ఉంచి దాని పై కొంచం కిరోసిన్ 
పోసి ,చుట్టూ కొంచం కొబ్బరి పీచు  ఉంచి ,
ముందుచిన్న బొగ్గులు దాని చుట్టూ పెద్ద బొగ్గులు ఉంచాలి.

పిడక వెలిగి ,చుట్టూ ఉన్నా పీచు రగులుకున్నాకా మెల్లిగా విసురుతూ 
ఉండాలి.కష్టమే కాని దాని పై వంకాయ కాల్చుకొని తొక్క తీసి నలిపి  ఉల్లిపాయలు,పచ్చి మిర్చి 
పెరుగు వేసుకొని పచ్చడి చేసుకుంటే దాని రుచి,పప్పు ఉడికితే రుచి,పాలు ఎర్రగా 
కాగితే వచ్చే వాసన ,తయారు అయ్యే పెరుగు,మీగడ ....అబ్బో లొట్టలు వెయ్యాల్సిందే.

ఇంకా అమ్మ చేసే కొత్త రకాలు వంటలు (అప్పట్లో)పాలు కాసి కోవా,క్యారెట్ హల్వా ...ఇలా..
 మధ్యాహ్నం దాకా ఉడుకుతూ  ఉంటాయి క్యారెట్లు.
తరువాత తొక్కు తీసి రుబ్బుతుంది(మిక్సి ఉండదు కదా)
తరువాత చక్కర నెయ్యి కలిపి మళ్ళా  కుంపటి మీద సన్న సెగపై ఉడకపెడుతుంది.
రంగు మారాలి అదీ లెక్క....హల్వా తయారు అయినట్లే.

ఉదయం మొదలు పెట్టిన యజ్ఞం సాయంత్రానికి  అవుతుంది.
మరి పిల్లలం ఊరుకుంటామా.....అలాగా దాని చుటూ కూర్చుని 
ఆ వాసన పీలుస్తూ కొంచం పెట్టించుకుంటాము ...చక్కర సరిపోయిందా లేదా 
అని.....అప్పుడే హల్వా తిన్నంత పొంగిపోతాము.
తిరుమల నడక దారిలో అలిపిరి మెట్లు అంత దూరమే వచ్చాము 
హల్వా తయారీలో అని తెలీక.....

తరువాత కిరోసిన్ స్టవ్ లు వచ్చినా కుంపటి స్తానం కుంపటిదే.
పాల కోసం,పప్పు కోసం అది రగులుతూ ఉండాల్సిందే.
తలక పోసుకుంటే సాంబ్రాణి వేసుకోవటానికి నిప్పులు,
దిష్టి తీసిన  ఉప్పు నిప్పుల్లో వెయ్యటం దాని అదనపు ప్రయోజనాలు.

అత్తగారింటికి వస్తే అంత మంది ఉన్నా ఇంటిలో ఒక మూల కోడి 
పెట్టలాగా కూర్చుని ఉంది ....పాలు మరపెడుతూ.పిల్లలు పుట్టినా దిగులు లేదు 
నిప్పులకు,సాంబ్రాణి దూపానికి.....ఇంకా అది అయ్యిన తరువాత ఆ నిప్పులు చిన్న 
గరిటలో ఉంచి బాలింతల మంచం కింద పెట్టె వారు వెచ్చగా ఉండాలని.

 పాలు కాగ పెట్టి,పెరుగు తోడేసి,మజ్జిగ  చిలికి వెన్న తియ్యాలి.
ఇంట్లో ఆడవాళ్ళకి అదొక పని.వెన్న తీసిన తరువాత తియ్యటి మజ్జిగ ఇంట్లో 
అందరికి ఇస్తే తాగుతారు అదొక అలవాటు.

బాబు ని కన్న తరువాత ఉద్యోగం లో పెంచలేక అమ్మకి ఇచ్చాను 
చూసుకోమని .ఒక రోజు చక్కగా మా అమ్మ మా తమ్ముడు కొడుకు నెలల 
పిల్లవాడిని వళ్ళో కూర్చో పెట్టుకొని,పక్కన వీడిని నిలుచో పెట్టుకొని 
శ్లోకాలు చెప్పిస్తూ ఉంటె....పక్కన పాలు కాచుతూ  ఉంది కుంపటి ...ఊ కొడుతూ...

ఉన్నట్లుంది మా తమ్ముడు కొడుకు కాలితో తన్నాడు తలుపుని.
తలుపు వెళ్లి కుంపటిని దొర్లించింది.ఇల్లంతా వేడి పాలు,నిప్పు కణికలు.
హడా వడిలో అమ్మ లెయ్య పొతే ...రెండేళ్ళ మా బాబు,మా తమ్ముడి కొడుకు 
పాలల్లో పడి పొయ్యారు.
వాడికేమో నడుము మీద మొల గజ్జెలు ముద్ర పడిపోయ్యాయి కాలి పొయ్యి.
వీడికేమో కుడి చెయ్యి కాలు.....ఇంకేమి చేస్తామే ammaలం ఇద్దరం 
రాత్రంతా పిల్లలను పొట్టకు కరిపించికొని  పడుకో పెట్టుకొని 
కొంగుతో కట్టుకున్నాము ...రెండో వైపు తిరిగితే బొబ్బలు చితికి పోతాయి అని.

 కుంపటి మీద కోపం రాలేదు కాని పిల్లల పరిస్తితి చూసి సుప్రీం కోర్ట్ 
ఆర్డర్ కుంపటి వెలిగించకూడదు  అని(పిల్లల తాతయ్య)
పాపం అంతే ఒక మూలకి వెళ్లి పొయ్యింది మౌనంగా ....

చివరగా ఒక రుచికరమైన జ్ఞాపకం ....మేము చిన్న పిల్లలప్పుడు 
మా నాయనమ్మ కుంపటి మీద సన్నపు సెగ బెట్టి చేసే 
ఉప్పిండి  (బియ్యం రవ్వతో చేసే ఉప్మా)ఏంటో బాగుంతున్దన్నట్లు....
కావాలంటే మ్యుజియం లోకి వెళుతున్న  కుంపటి నడగండి...ఒట్టు .


ఎడిటర్ గారికి నమస్తే.
ఈ నలబై ఏళ్ళ వయసులో నా కుంపటి కమ్మని కబుర్లు 
అందరికి చెప్పే అవకాశం వస్తుందని ఎప్పటికి అనుకోలేదు.
థాంక్యు వేరి మచ్........వాయుగుండ్ల.శశి కళ,నాయుడుపేట,