Monday 15 June 2015

ఆయన జీవనమే మానవత్వపు వేదం

ఆయన జీవనమే మానవత్వపు వేదం 
ఎవరి గురించి వ్రాస్తున్నాను ,ఇంత లేట్ గా వ్రాయడం ఏమి 
బాగుంటుంది !ఏమి కాదులే పెద్దాయన నేను తలుచుకున్నాను అని 
సంతోషపడతారు . చదవరుల సంతోషమే రచయితల సంతోషం :)

ఈ లోపల మాలిక వెబ్ మాగజైన్ లో నా కధ ''స్పేస్ షిప్ '' చదివి రండి . 
sapace ship link in malika magzine

ఆయన పేరు ''దాశరధి రంగాచార్యులు ''గారు ,ఆయన పుట్టినది 
తెలంగాణా లోని చిన్న గూడూరు లో . వారి అన్నగారు కృష్ణమాచార్యులు 
గారు కవి అయినప్పటికీ ఈయన వచన రచన లోనే ప్రసిద్ధులు . 
తెలంగాణా మాండలీకం లో ఈయన వ్రాసిన చిల్లర దేవుళ్ళు ,నాటి 
నైజాం పాలన లో ప్రజల కష్టాలను తెలియచేస్తుంది . 

ఇలాగే వ్రాయాలి కదా !

కాని ఏమిటో ఆయన నాకు ఏ అక్షరాలుగా పరిచయం
 అయ్యాడో ,ఆయన 
శైలి నాకు ఎంత నచ్చుతుందో చెప్పాలి . 

వార పత్రికలలోనే ఆయన రచనలు పరిచయం . రచన బోలెడు సార్లు 
చదువుతాను కాని ,వ్రాసినది ఎవరు ,ఎక్కడి వారు పెద్దగా పట్టించుకోను . 
ఏదో నదీ మూలానికి ప్రయాణం గూర్చి వ్రాసారు . ఈయన నడిచి వెళ్ళగలరు . 
కమల గారిని డోలి ఎక్కిస్తే ఆ జనాలలో ఆవిడ ముందు వెళ్ళిపోతుంది . 
ఆమె జాడ ఈయనకు తెలీదు . ఈయన ఎంత కంగారు పడుతారో 
అని ఆవిడకు కంగారు . తెలియని బాష . చివరికి ఎవరినో బ్రతిమిలాడుకొని 
తన క్షేమ సమాచారం పంపుతుంది ఈయనకు . హమ్మయ్య అని 
ఈయన ప్రాణం కుదుట పడుతుంది . 
ఏమిటో ఇది అని మొదలు పెట్టిన నాకు వాళ్ళు ఇద్దరు కలిసే వరకు 
చదవకుండా ఆపలేక పోయాను . మామూలు పదాల నిర్మాణం . 
దానిలోని అంతర్లీన నిజాయతీ మనలను అక్షరాల వెంట నడిపిస్తుంది . 
పెద్దవాళ్ళకు ఇంత ప్రేమ ఉంటుందా ,అనుకున్నాను . ఇప్పుడు 
పిల్లల పెళ్లి అయినాక అనుభవం లో తెలుస్తూ ఉంది . 
అది మొదలు రంగాచార్య అని పేరు కనపడితే ఆపకుండా చదివేస్తాను . 

అప్పటి అలవాట్లు ,పద్దతులు ఎందుకు పాటించేవారో ,ఎంత చక్కగా 
వ్రాస్తారో !మన పెద్ద అన్నయ్య మన పక్కన కూర్చొని చెప్పినట్లు 
ఉంటుంది . 
వాళ్ళ నాన్న గారు ఆ రోజుల్లో నడిచి ప్రయాణం చేసేటపుడు ఒక 
ఊరు దగ్గర ప్లేగు వ్యాధి ఉందని లోపలి రానివ్వరు . మళ్ళీ బ్రాహ్మణుని 
అభోజనంగా ఉంచకూడదు అని స్వయం పాకం ఇస్తారు . కాని 
వండుకోను పాత్రలు ఇవ్వరు . ఇక ఇప్పుడు ఏమి చేస్తాడు !
నాకు కూడా తెలుసుకోవాలి అనిపించింది . ఎందుకంటె మనిషి 
జయించ లేనివి  నిద్ర , ఆకలి . 
ఆయన పై పంచెలో బియ్యం ,పప్పు అన్ని పోసి మూట గట్టి ఏటి 
నీళ్ళలో ముంచి కడుగుతాడు . ఇప్పుడు ఉదికించేది ఎలాగా 
అనుకున్నాను . చిన్న చెలమ ఇసుక లో చేసి ఊరిన నీళ్ళలో 
మూటను ఉంచి పైన ఇసుకను కప్పి మండే చితుకులు వేసి 
అవి ఆరిపోయిన తరువాత మూటలో ఉన్నది తినేస్తాడు . 
అసలు అలాగ చెయ్యొచ్చా ?ఎవరి కైనా తెలుసా ? ప్రతీ అలవాటు , 
పద్ధతి ఆయన వివరిస్తుంటే భారతీయ జీవిత విధానం మీద 
ఎంతో గౌరవం పెరిగిపోతుంది . 
మొన్న ఆయన చనిపోయిన రోజు జీవన వేదం చదివి ఈయనతో 
ఆన్నాను . ''ఆయన ఒక్క రోజు కూడా భార్య మీద కోపం చూపించ లేదంట ''
ఈయన శైలి లో ఈయన జవాబు 
''పిల్లల పెళ్ళిళ్ళు అయిపోతే కోపాలు ఉండవమ్మ . అంతా ప్రేమే . 
వాళ్ళు ఉన్నపుడే వాళ్ళ చదువులు , పెంపకం , ఆర్దిక ఇబ్బందులు . 
వాటి వలన కోపాలు . పెద్దవాళ్ళు అయినాక ప్రేమలు పెరుగుతాయి '' 
నిజమే కాబోలు . ఈయనకు తెలీనిది నాకు మాత్రం ఏమి తెలుసు .... 
                                              @@@@@@@@ 



2 comments:

Anonymous said...

ఇటువంటి విషయాలే జీవితంలోంచి పెద్దలగూర్చి నేర్చుకున్న అనుభూతినిస్తాయి. మీరు ఆనందించి మాతో పంచుకొన్నందుకు కృతజ్ఞతలు.

శశి కళ said...

thank you sir