Monday 17 March 2014

కాలం మారిందంట ... ఏమి మారిందో

 ''ఈ రోజు నాయుడుపేట లో మహిళా దినోత్సవం 
యు . టి . ఎఫ్ వాళ్ళం బాగా చేస్తున్నాము . నువ్వు 
రారాదా ?''శ్రీవారి సజెషన్ ,మహిళా దినోత్సవ 
శుభాకాంక్షలు చెపుతూ . 
అయ్యో మా స్కూల్ లో ప్రీ ఫైనల్ జరుగుతున్నాయి . 
సెలవు పెట్టకూడదు ''అని .... 
''అయినా మేము మగాళ్లకంటే తక్కువే నంట కదా ,
మాకెందుకు లెండి ఇవన్నీ ''మనసులో మాట ఉంచుకొనే 
అలవాటే లేదు కాబట్టి గబుక్కున అనేసాను . 

అదీ కాక ఈ రోజు మా స్కూల్ లో పిల్లల చేత వివిధ 
రంగాలలో విజయం సాదించిన మహిళల గూర్చి వ్యాసాలు 
వ్రాయించి 'గోడ పత్రిక ' ప్రదర్శిస్తున్నాను . ఇంకా అందరి కంటే 
స్కూల్ కి ముందు వెళ్లి పిల్లలు నేను కలిసి స్కూల్ కి 
వచ్చే ఒక్కో మేడం కి చప్పట్లు కొడుతూ ఆహ్వానం పలికి 
చాక్లెట్స్ ఇస్తూ విషస్ చెప్పేలా ప్లాన్ వేసి ఉన్నాను . 
అసలు అనుకోకుండా అలా విషస్ పొందేసరికి మేడమ్స్ 
మొహాలు వెలిగిపోయాయి . మాకెందుకు మేడం అని 
కొందరు పైకి మొహమాట పడ్డారు . 

''లేదు మీకు కాకుంటే ఎవరికి చెపుతారు పిల్లలు ... 
మీరు విద్య సాదించారు ,ఆర్ధిక స్వావలంభన సాదించారు , 
ఇంకా ఇంత మంది పిల్లలకు బోదిస్తూ సమాజ సేవ చేస్తున్నారు . 
పిల్లలకు జీవిత సార్ధకత ను గూర్చి మీకంటే లైవ్ ఎక్సాంపుల్ 
ఎవరున్నారు ''అని చెప్పాను . 

నిజంగా కొద్ది పాటి ప్రశంస కూడా దొరక్క అందరు ఎంత 
నిసృహ లోకి వెళుతున్నారు అంటే ,వాళ్ళ సామర్ధ్యాలను 
వాళ్ళే మర్చిపోతున్నారు . 
చంద్రబాబు నాయుడు చెప్పినట్లు ఆదివారం అల్లా సెలవు 
ఇవ్వకపోతే పోనీ .... కనీసం ఈ ఒక్క రోజు వాళ్ళు చేసిన 
పనుల్లో ఏదో ఒక మంచి పనికి మెచ్చుకోవచ్చు కదా !
వంట చేయవచ్చు కదా!తప్పు లకు  వెంటనే విమర్శించే 
మీరు, నాటకీయమే కావచ్చు ... మెచ్చుకోవడం ,లేదా 
విషస్ ,లేదా బహుమతి ఇవ్వడం ఎంత ఆనందంగా 
ఉంటుంది . మురిసిపోయి పళ్ళెం నిండా మురిపాలు వడ్డించరా   
ఏమిటి ?ఏమిటో కాలం మారిందంట . ఇంకా ఆడవాళ్ళను 
ఎలా సంతోషపెట్టాలో తెలీదు కాని పెద్ద . 

సరే పిలిచారు కదా అని పర్మిషన్ పెట్టి స్కూల్ నుండి 
స్కూటీ లో బయటకు వచ్చేసరికి ఎదురుగా ఒక గుంపు . 
చెన్నై హైవే మీద మా స్కూల్ దగ్గర డివైడర్ కట్ అవుతుంది . 
కారు ,రోడ్ దాటే స్కూటర్ డిష్యుం . మనిషి బోర్లా 
పడున్నాడు . ఎవరో 108 కి ఫోన్ చేస్తున్నారు . హమ్మయ్య 
అనుకోని ఏమి కాకూడదు అని ప్రార్ధించుకుంటూ కొంచెం ముందుకు వెళ్ళే సరికి 
108 వస్తూ కనిపించింది . ఇదంటే నాకు భలే ఇష్టం . 
మనిషి బాగానే ఉన్నాడు . హమ్మయ్య . లేకుంటే ఇంక
రాత్రికి నిద్ర కష్టమే . ఎంత మంచి రోడ్స్ వేస్తే అన్ని ఆక్సిడెంట్ లు 
పెరుగుతున్నాయి . ప్రమాదానికి పేదా గొప్ప తేడా లేదు . 
ఏదో శాటిలైట్ ప్రపంచం అంట .... ప్రమాదం తరువాత మొదటి 
అరగంట ఎంతో విలువ అనితెలిసి కూడా ప్రాణాలు కాపాడుకోలేక పోతున్నాము , 
కాలం మారిందంట ఏమి మారిందో ?

మీటింగ్ కి వెళ్లాను . కొంత మంది ఆడవాళ్ళు వేదిక మీద . కాని 
కావలిసిన ఏర్పాట్లన్నీ చక్కగా స్వీట్ హాట్ తో సహా మగవాళ్ళే 
అందిస్తూ మీటింగ్ చక్కగా సాగటానికి సహకరిస్తున్నారు . 
వాళ్ళు యు . టి ఎఫ్ . వాళ్ళు చక్కగా చేయాలి అని చెప్పారు 
అంట . వెనుక మా వారు కూర్చొని ఉన్నారు లెండి . అందుకు అన్ని 
విషయాలు నాకు తెలిసాయి . 
రిటైర్డ్ ఎం . ఈ . ఓ సుశీల గారిని ,ఉత్తమ ఉపాధ్యాయురాలు బారతి 
గారిని నన్ను చక్కగా సన్మానించారు . అందరు మాట్లాడాల్సిందే అని 
ఒక హెచ్చరిక . విధి లేక చాలా మంది మాట్లాడారు . ఏమో అనుకున్నాను 
వీళ్ళు బయటకువచ్చి మాట్లాడారు కాని ఎంత చక్కటి కోణాలు 
టచ్ చేస్తూ మాట్లాడారో .... ఒక అందమైన  రంగుల హరివిల్లు 
జీవితాన్ని చూపిస్తూ ఆవిష్కరింప బడింది . 
సుశీల అన్నారు చదువుకొని ఉద్యోగం చేసేవాళ్ళు అన్నా కొంత 
మనసునివిశాలం చేసుకొని సమాజం గూర్చి ఆలోచించాలి అన్నారు . 
భారతి గారు తాను ఇక్కడకు బయలుదేరగానే వాళ్ళ భర్త 
ఎదురొచ్చిన సంగతి ''వంట చేసి ఎక్కడికైనా పొమ్మని ''విశాల 
హృదయం తో పర్మిషన్ ఇచ్చిన సంగతి ,శోభా రాణి గారు తను 
కస్తూరిబా డ్రాప్ అవుట్ స్కూల్ లో ఒకో సారి అక్కడే ఉండి  పల్లెలు తిరిగి 
పిల్లలను ఇప్పించిన సంగతి చెప్పి వాళ్ళ భర్త కు కృతజ్ఞతలు 
చెప్పారు . అనిత గారు అయితే తాను అందరికి ఈ మీటింగ్ కోసం 
ఫోన్లు చేసినా ఎవరూ రాలేదని బాధపడి మనకు వాళ్ళే వేదిక ఏర్పాటు 
చేసి మాట్లాడుకోమన్నా మనం ఇలా రాక పోతే మన సమస్యలు ఎలా 
పరిష్కారం అవుతాయి అని ప్రశ్నించారు . ఇంకా తను తన బాబు చేత 
కూడా అన్ని పనులు చేయిస్తాను అని ,చిన్నప్పటి  నుండి ఆడ మగ 
తేడా చూప్న్చాకూడదు అని చెప్పారు . 
ఇక వసంతమ్మ గారు పోయన సారి ఈ సారి సభ మేమే చేసుకుంటాము 
అన్నాము కాని వీలు కాలేదు . ఈసారి తప్పకుండా మా వేదిక మేమే 
చేసుకుంటాము అని చర్విత చరణపు హామీ ఇచ్చారు . 

ఇక నేను ''స్వేచ్చ కావాలనడం తప్పు కాదు . కాని దానిని సద్వినియోగం 
చేస్తేనే మన మీద గౌరవం తెచ్చుకోగలం . ముందు సభలకు హాజరు 
కావాలి . అపుడు సంఖ్యా బలమే చాల చట్టాలు తెచ్చు కోవడానికి 
ఉపయోగపడుతుంది'' అని చెప్పాను .

ఇంతా చేస్తే మీటింగ్ తరువాత వచ్చిన వాళ్లకి ''జ్యూస్ సెట్ ''ఇచ్చారు ,
అయినా కాని  చూద్దుము కదా .... ఆడవాళ్ళు అందరు ఇంటికి వెళ్లి పోయారు .
ఏమంటే వంట సగం లో వదిలి వచ్చారంట . 
హ్మ్ .... కాలం మారిందంట . ఏమి మారిందో ?
మనలో మాట ..... మహిళా దినోత్సవం అయిపోయి ఎన్ని రోజులు 
అయింది ?ఇప్పటి దాకా వ్రాసి ఇప్పటికి పోస్ట్ వేసాను అంటే ,
పనుల వల్లే కదా :))


2 comments:

Krishna said...

papam okka rojanna vanta nundi miku viramam ivvaleda sister dinni tivram ga khandichalsinde (papam okka rojanna ma sister vandaka pote ma bava prasantam ga tintadule anukunte a adrustam lenatlundi i pitty you bavagaru) nenu Jump

శశి కళ said...

kittee :))