Monday 19 November 2012

దేవుడు కనపడి వరమిస్తే ....

దేవుడు కనపడటమా?వరం ఇవ్వడమా ?
నాన్సెన్స్ ...ఏమిటండి పుటుక్కున అలా అనేసారు.
ఇలాగ అనుకోవడం వలన మన లక్ష్యాలు ఎన్ని 
ఉన్నాయి ఇలాగ మనకు ఒక క్లారిటీ ఏర్పడుతుంది.

సరే లెండి ....గొడవ ఎందుకు ఇప్పుడు ముందు 
టాపిక్ చూద్దాము.ఇప్పుడు టకామని మా ముందు 
దేవుడు ప్రత్యక్షం అయ్యాడు అనుకోండి ......
ముందు మా అయన వంతు....
ఏమడుగుతాడు అంటే సింపుల్ 
''స్వామీ శశి ,పిల్లలు ఎప్పుడు బాగుండాలి''అని నా వైపు 
గొప్పగా చూస్తాడు.....నేను గుడ్ అని తలఊపి 
శేబాష్ అన్నట్లు నవ్వుతాను.అప్పుడు నాకు గుర్తుకు 
వస్తుంది.
''ఏమండీ ....కేవ్వ్వ్వవ్వ్వ్వవ్వ్వ్ మీ గూర్చి 
కోరుకోలేదు''
''ఒరే ....పర్లేదులే మీరు బాగుంటే నేను బాగుంటాను''
''ఊహు అలా కాదు మీ గూర్చి కోరుకొనాలి ''

ఇప్పుడు ఎలా?మనకేమో దేవుడు ఇంకో వరం ఇస్తాడో లేదో 
పెద్ద క్లారిటీ లేదు.అయినా మనం ఫీల్ అవుతాం కాని 
దేవునికి లెక్క ఏమిటి?అమ్మ కన్నా ఎక్కువ కదా 
మనం అంటే ఎంతో  ప్రేమ కదా...ఎన్ని అడిగినా ఇచ్చేస్తాడు కదా !
ఈయన వెంటనే వద్దు లేవే 
ఇంకోటి అడిగితె ఏమంటాడో ఏమో...సందేహం.

''మీరు ఊరుకోండి ..మీకేమి తెలీదు.నేను లేకపొతే 
ఎలా బ్రతుకుతారో ఏమో...అ..నేను అడుగుతాను 
నాకు వరం ఇంకా ఇవ్వలేదు కదా "
ఏమని అడగాలి?నా మాంగల్యం చల్లగుండాలి అంటే...
అయితే ప్రిజ్ లో పెట్టు అంటాడేమో...అయినా దేవుడు 
జోకులు వేస్తాడా ఎక్కడైనా......ఆ...ఐడియా...

''స్వామీ నేను ముత్తైదువగా చనిపోవాలి''
ఆయన చిన్నగా నవ్వాడు...తరతరాలుగా ఇదే 
డైలాగ్ ...మీరు ఇంక మారరా?సరే ఇచ్చితిని పో .....
హమ్మయ్య ....అందరం సేఫ్....మా పిల్లలు ఏమి కోరుకుంటారో?
దాని మీద నాకు క్లారిటీ లేదు.

ఇంకా కొన్ని కోరికలు కధలలో విన్నాను.ఇవి ఒక్క 
కోరిక లాగే ఉంటాయి ఆని మల్టిపుల్ అన్న మాట.

మొదటి కధ ....ఒకామె దేవుడిని కోరిందంట 
మా ఇంట్లో బంగారు ఊయలలో నా కొడుకు ఊగుతుంటే 
మా అత్తామామలు సంతోషంగా చూడాలి అని....
అంటే బంగారం,కొడుకు,అత్తమామలకు చూపు ఇలా 
ఒకే కోరికతో అనీ వచ్చేసాయి.

ఇంకో కద రాజు గారు ఒక యువకుడిని ఏమి కావాలో 
కోరుకో అనే ''మీరు మా ఊరికి వచ్చి మూడు రోజులు ఉండాలి''
అని కోరుతాడు.పాపం అని ఆ యువకుడి మీద అందరు 
జాలి పడుతారు.తీరా రాజు ఆ ఊరికి బయలుదేరితే తెలుస్తుంది 
విషయం.ఆయన కోసం ఆ ఊరికి రోడ్,బావులు,సత్రాలు,
వైద్య్యశాల,గుడి,బడి అన్ని కట్టించేస్తారు.అప్పుడు అందరు 
శెబాష్ అంటారు.
సరే ఇప్పుడు ఎవరు ఏమి కోరుతారో చూద్దాము....
ఒక క్రీడాకారుడు ఉంటె ...పతకాలు 
ఒక రచయిత ఉంటె ....రచనలకు పేరు 
వ్యాపారస్తుడు ....వ్యాపారం లో ధనం ఇలాగా 

మరి సంవత్సరం లోపు పసి బిడ్డలు ఏమి కోరుతారు?
ఏమి కోరుతారు చక్కటి నవ్వులు దేవునికే ఇచ్చి 
పంపేస్తారు.

అసలు ఏమి కోరుకోవాలి?ఏదైనా శాశ్వతంగా ఉండాలి 
అనుకుంటాము కదా....శాశ్వతం అంటే ఎప్పటికి మారనిది.
ఎప్పటికి మారనిది ఏమిటో తెలుసా?అదే సత్యం 
ఎప్పటికి మనం కోరుకోవాల్సినది ....
మనం చేరుకోవాల్సినది అదే ...
అప్పుడే మనకు అమృతత్వం 

అందుకే అన్నారు 
''అసతోమా సద్గమయా 
తమసోమా జ్యోతిర్గమయా 
మృత్యోర్మా అమృతంగమయా''

ఇక ఎప్పుడైనా మీరు కోరుకోవాల్సి వస్తే ఏమి 
కోరుకోవాలో తెలుసా?
''ఆత్మజ్ఞానం''అది ఉంటె అన్ని మన వెంటే ......

దీనికి ఏమి చేయక్కర్లేదు.కళ్ళు మూసుకొని ప్రశాంతంగా 
''శ్వాస మీద ధ్యాస''అంటే గమనిస్తూ ఉండండి.
గమనిస్తూ ఉండండి.మీలో ఎక్కడ ఏమి జరుగుతుందో గమనిస్తూ 
ఉండండి.ఒక తల్లి కడుపులో పిండం లాగా 
మీలో జరగాల్సిన మార్పులు జరిగిపోతాయి .
మీరు సత్యాన్ని చేరిపోతారు.ఎలా?అంటే ....
ఇదిగో ముందు కావాల్సిందే విశ్వాసమే .....
పాలల్లో వెన్న ఉంది అని మాత్రమె చెపుతారు.
చేయాల్సిన రీతిలో కళ్ళు మూసుకొని గమనిస్తూ 
ఆ వెన్నను చూడాల్సిన బాధ్యతా మీదే....




3 comments:

Om Tat Sat said...

baagundi

సుభ/subha said...

Very well said Madam gaaruu..

శశి కళ said...

థాంక్ యు తత్సత్ గారు,సుభ గారు