Sunday 21 September 2014

అక్కినేని ..... ఆత్మీయతల గని

 ''అక్కినేని వారికి కొంచెం లేట్ గా పుట్టిన రోజు శుభాకాంక్షలు '' 
మా ఎన్ . టి . ఆర్ అన్నగారికి కూడా ఎప్పుడు చెప్పలేదు . 
అదీ నిన్న చెప్పలేదు . ఈ రోజు ఎందుకు చెప్పాలి అనిపించింది అంటే 
మధ్యాహ్నం ''మనం'' మీద టి . వి లో చూసిన ప్రోగ్రాం . 
ఎంత చక్కగా వాళ్ళ నాన్నగారిని గుర్తుకు తెచ్చుకున్నారో . 
ఆయనే బ్రతికి ఉన్నట్లు ఆయన తరుపున అభిమానులకు 
ఎంత బాగా థాంక్స్ చెప్పారో . పాపం నాగార్జున కు ,సుశీలాకు 
కళ్ళు తడుస్తూనే ఉన్నాయి . ఒకరు స్క్రిప్ట్ వ్రాసి ఇస్తేనో ,
ఆక్షన్ చేపెతేనో వచ్చేవా అవి !ఒక కుటుంభ పెద్దగా అందరితో 
ఆత్మీయంగా ముడి వేసుకొని ఆయన పెంచిన బంధాలు అవి . 


ఇంకా అమెరికా లో ఉన్న ఆయన అభిమానులు  ''స్టాంప్ ''కూడా 
ఆయన ఫోటో తో విడుదల చేసారు . చనిపోయినా బ్రతికి ఉండటం 
అంటే అది . అది ఏ కొందరికో దక్కుతుంది . 
మా ఎన్ . టి.  ఆర్ కి ఉన్నారు లెక్కకి అంత మంది పిల్లలు . 
ఏ రోజైనా అందరు ఒక తాటి మీద నిలిచి స్టాంప్ వేస్తారా ?
సరే లెండి పోలికలు ఎందుకు ?పైనున్న అన్నగారు బాధ పడతారు :(

నాగార్జున అంటే మా వారికి ప్రాణం . నాగార్జున వాళ్ళ నాన్న 
గూర్చి అన్న మాటలు ఎంత బాగున్నాయో !

నాన్న అంటే ప్రేమ 
నాన్న అంటే మనసు 
నాన్న అంటే మనిషి ..... చాలు మనిషి ఎలా ఉంటె జీవితం 
పరిపూర్ణంగా ప్రశాంతంగా జీవించగలడో ఆ  రహస్యం ఇదే . 

ఇప్పుడు ఆయన గూర్చి పోస్ట్ ఏమి వేయను కాని నేను  
అప్పుడు వ్రాసిన ''మనం'' మళ్ళీ లింక్ ఇస్తాను . 
(manam post link ikkada )
నివాస్ కూడా ''ఈ సినిమా మళ్ళీ చూడాలి ''అని ఫీల్ అయ్యాడు . 
వీలు అయితే మీరు కూడా మళ్ళీ చూడండి . మీ గుండె కూడా 
అక్కినేని ని చూసి లబ్ డబ్ అని కొట్టుకుంటుందేమో . 

ఆయన ఒక పరిపూర్ణమైన జీవితాన్ని గడిపారు . ఆయన గూర్చి 
బాధ పడవలసినది ఏమి లేదు అని వాళ్ళ పిల్లలే చెపుతున్నప్పుడు 
మనం బాధపడవలసిన విషయం మాత్రం ఎక్కడ ఉంది .?
దీనికి బదులు మొన్న మెడిటేషన్ క్లాస్ లో విన్న నాలుగు మంచి మాటలు 
చెపుతాను . ఈయన ఇంట్లో పని వదిలిపెట్టి పోతావా అని అంటే ...... 
ఊహూ పిల్లలకు పెళ్లి అయినాకా కూడా ఇంట్లో పనులే ముఖ్యం 
అనుకుంటే నేను జ్ఞానం ఎప్పుడు తెలుసుకోవాలి అనుకోని మరీ 
వెళ్లాను . 

క్లాస్ శ్రీనివాస్ గాంధి గారు చెప్పారు . 
హై స్కూల్ పిల్లల దగ్గర నుండి ముసలి వాళ్ళ వరకు అక్కడికి 
వచ్చారు . ఏదో లాభం వస్తుందనో ఎవరో ఆశ పెడితేనో వారు 
అక్కడకు వచ్చారా ?లేదే . ఏ శక్తి ఇంత మందిని ఇక్కడకు 
లాక్కొని వస్తుంది . అందరు కలిసి సామూహిక ధ్యానం అంటే 
శ్వాస మీద ధ్యాస చేస్తూ ఉంటారు . చిన్న పిల్లల అనుభవాలు 
వింటూ ఉంటె ,ఇతరుల మనసు లోని ఆలోచనలు కూడా 
వాళ్ళు చెపుతూ ఉంటె మనం ఆశ్చర్య పోతాము . 

చిత్రంగా ఆ రోజు జన్మల గురించి ఇంకా ధ్యాన పరిచయం 
గురించి చెప్పారు . కొంత వరకు ఆధ్యాత్మిక వాతావరణం లో 
పుట్టిన వారికి పునర్జన్మ ల మీద నమ్మకం తప్పక ఉంటుంది . 
ఒక్కో ఆత్మ ఎన్ని జన్మలు ఎత్తుతుందో తెలుసా ?
కీటకాలు కావొచ్చు , చెట్లు కావొచ్చు ,జంతువులు కావొచ్చు , 
మనుషులు కావొచ్చు అందులో ఆడ ,మగ ఎవరైనా  కావొచ్చు ,
కొన్ని వందల జన్మలు ఎత్తి ఉండవచ్చు . నిజమా అంటే .... 
పాలల్లో వెన్న ఉన్నంత  నిజం . కాకుంటే నీలోకి నువ్వే ప్రయాణం 
చేసుకొని చూసుకోవాలి . ఎందుకు ఇన్ని ఎత్తడం అంటే 
ఆ జన్మ యొక్క పరిపూర్ణమైన అనుభవాలను పొందడానికి . 
అసలు పాతవి చూసే కొద్ది .... ఎన్నో సార్లు ఆడవాళ్ళుగా , 
ఎన్నో సార్లు మగవాళ్ళుగా మనమే ఉండటం చూసి ఎలా 
పుడితే ఏముంది ,అందరం అక్కడి వాళ్ళమే ,ఆత్మలమే 
అని అవగతం అయ్యి ఈ తేడాలు పెద్దగా పట్టించుకోము . 
లడ్డూల రుచి నాలుక పూర్తిగా గ్రహించినపుడు అవంటే 
మనకు వెగటు వేసినట్లు ఈ జన్మలు అంతే . ....... 
దీనిలో ఏమి లేదు అని మనకు వెగటు పుట్టే దాకా 
పుడుతూనే ఉంటాము . 

మన శరీరం వేరు ,మనం వేరు అనే కాన్సెప్ట్ నమ్మడానికి 
మనకు చాలా కష్టం . కాని ధ్యానం చేసి చూసినపుడు 
ఆ అనుభవాన్ని చూడటానికి మనకు సరిపోయే ఎనెర్జీ 
వచ్చినపుడు అది మనం ఫీల్ అవ్వగలం . 

నేను మాత్రం చదువుకున్న దాన్ని ఇవన్నీ నమ్ముతానా !
కాని భారత దేశపు ఆధ్యాత్మికత నన్ను దానిలోకి లాక్కెళ్ళి 
మరీ చూపిస్తూ ఉంటుంది . మన సుకర్మ లు పాప కర్మ లు 
బాలెన్స్ అయి మనం సత్వ దశలో ఉన్నప్పుడు మనకు 
ఎక్కడో ఒక దగ్గర లేదా ఎవరో ఒకరి ద్వారా ధ్యాన పరిచయం 
కలుగుతుంది . దాని సాధన చేస్తామా లేదా అనేది మన ఇష్టం . 
కాని దాని పరిచయం జరిగింది అంటే దానిలో మనం ముందుకు 
సాగవలసిన సమయం వచ్చింది అనేది స్పష్టం . 


ఒక రోజు తెల్లవారు జామున ధ్యానం చేసినపుడు నాకు 
ఈ ఆత్మ వేరు అనే  అనుభవం కలిగింది . ఉన్నట్లుండి  
నేను ఒక గుహలో ఉన్నట్లు ఆ గుహ నా శరీరం అయినట్లు , 
నేను వేరుగా, శరీరం వేరుగా అనిపించింది . నేను ఎందుకు 
ఇక్కడ ఇరుక్కొని ఉన్నాను అనిపించింది . ఇక ఇప్పుడు 
నేను ఆత్మ వేరే, శరీరం వేరే అంట .... అది పలానా 
వాళ్ళు చెప్పారు అనాల్సిన పని లేదు . ఎందుకంటె 
అది నేను చూసాను కదా . కాకుంటే మళ్ళా మన 
మామూలు జీవితం లోకి వచ్చేస్తాము ,అంతా మామూలుగా 
నడిచిపోతుంది అంతే . 

అక్కినేని గారు మనం డైరక్టర్ విక్రం గారిని అడిగారంట ..... 
''నాగార్జున కి ,చైతన్య కి హీరోయిన్స్ ని పెట్టావు ,నాకు 
పెట్టలేదే అని '' చనిపోయే ముందు కూడా ఎంత హుషారు . 
అందరికీ పంచి పెట్టగలిగినంత  ఆనందం . మనలో ఏది ఉంటె 
అదే అందరికీ పంచుతాము . కావాల్సింది అక్కినేని 
గారి లాంటి నిష్కల్మషమైన పసిబిడ్డ లాంటి  మనసు. 
దేవుని రాజ్యం పిల్లలదే అంటే అర్ధం ఇదే . దేవుని రాజ్యం 
అంటే సంతోషం తో నిండినది .... దానిలోకి బోలెడు కల్మషాలు 
అహాలు గల పెద్దలు ఎప్పటికీ ప్రవేశించలేరు . 
మిగిలిన జీవితాలలోకి తొంగి చూసే పని ఆపేసి మీ 
జీవితాన్ని మీరు పసి పిల్లలుగా పరిపూర్ణంగా అనుభవించండి . 
మీలో ఉన్న ఆనందాన్ని మీ చుట్టూ ఉన్నవారికి పంచండి . 
అప్పుడు మీరు కూడా చనిపోయినా అందరి హృదయాలలో 
బ్రతికే ఉంటారు . 
                      @@@@@@@@@@@  

No comments: