Friday 20 February 2015

యూ టూ ''రాగతి పండరి '' గారు

యూ టూ ''రాగతి పండరి '' గారు ... 
మీరు కూడా వెళ్ళిపోయారా !!! :(
ఏదో గీతల బాషలో కూడా మహిళా శక్తి కి చోటు 
ఉంది అని మిమ్మల్ని చూసి మురిసిపోతుంటిమి. 
ఇలా కార్టూన్ ప్రియులను బాధపెట్టి ఎక్కడకు వెళ్ళిపోయారు ?




ఎంత మంచి కాలం అప్పట్లో , మాగజైన్స్ లో మీవి , బాపు వి , మల్లిక్ వి 
లక్ష్మణ్ గారివి ఇంకా ... ఇంకా .... చదువుకొని నిష్కల్మషంగా 
నవ్వేసుకొని ఆయుష్షు పెంచుకున్న కాలం . 
భార్య ల ఆరళ్ళు , పిల్లల అల్లరులు , ముగ్గుల ముచ్చట్లు , 
ఇంకా ఉగాది పచ్చడులు తెలుగుతనం పొంగి పొరలే కార్టూన్ లు 
చదివి భర్త కు కనపడకుండా కొంగు చాటున నవ్వుకొనే కాలం . 

కళా కారుల పర్సనల్ విషయాలు నేను పెద్దగా పట్టించుకోను ,నేను 
గౌరవం ఇచ్చేది వారి జ్ఞానానికి . కాని మీకు పోలియో అని తెలిసిన 
రోజున చాలా బాధ పడ్డాను . ఏది అడ్డం కాకుండా మీరు ఎదగడం 
చూసి స్పూర్తిని పొందాను . ఎప్పుడో ఒకప్పుడు మీ సలహాలు 
పొందుదాము అనుకున్న మాట వాస్తవమే . మీరేమో నేను 
కొంచెం ఏకలవ్య గురువు అన్నందుకే వెళ్ళిపోతే ఎలా ?

మీరు స్కెచ్ తో గీసే సంగతి ఈ రోజు సాక్షి లో చూస్తే తెలిసింది . 
''హమ్మయ్య . దేనితో గీసాము అనేది కాదు అన్నయ్య ..... 
జోకు పేలిందా లేదా '' అనే డైలాగ్ ఇక వాడేసుకోవచ్చు . 
నేను రెండు చేతులతో బోలెడు గీతాలు గీసుకోవచ్చు . 
మనలో మాట ఎప్పుడైనా కార్టూన్ బుక్ వేయిస్తే మిమ్మల్ని 
ముందుగా ప్రస్తావిస్తాను . 

దేవుడా క్లారిటీ గా చెపుతున్నాను విను . నాకు గీతల గురువులు లేరు . 
నా వంకర గీతాలకి దానికి తగిలించిన తుంటరి మాటలకి నేనే బాధ్యురాలిని . 
హమ్మయ్య ఇక ''గీత కారులు '' అందరు ప్రశాంతంగా గుండెల మీద కుంచెలు 
ఉంచుకొని నిద్ర పోవచ్చు . 
రాగతి పండరి గారు సాక్షి లో ''జయ దేవ్ ''గారు వ్రాసిన ఆర్టికల్ చూడండి . 
మీకు ఆత్మా శాంతి కలగాలి అని కోరుకుంటూ .... సెలవు . 



No comments: