Wednesday 16 November 2011

ఎందుకు ఆగిపోతున్నాము అక్కడ?

ఆగిపోకండి అక్కడే... రండి ....చైతన్యం  లోభాగం 
కావటానికి....... 
నేను నది మాస పత్రిక గూర్చి తరువాత బంధాలు -
అనుభందాలు పై నా కధ ప్రచురింప బడిన ప్రతి 
వచ్చిన తరువాత వ్రాద్దామనుకున్నాను.కాని ఎందుకో 
ఇప్పుడే వ్రాయాలని అనిపించింది.


రచయితగా,పాటకురాలిగా నది నాకు సుపరిచితం.
ప్రింటింగ్,పేజ్ నాణ్యత,బొమ్మలు కాక విలువలలో 
చాలా వాటికన్నా పైన ఈ పత్రిక ఉంటుంది.దానిలో ప్రచురించిన 
గురజాడ వారి కధ పరిచయం చేయాలనీ వ్రాస్తున్నాను.


ఎందరో రచయితలు దాంపత్య జీవనాన్ని అన్ని కోణాలలో 
ఎంతో చక్కగా ప్రతి ఒక్కరు నా కధే అనుకునేటట్లు 
వ్రాస్తున్నారు.కాని దాంపత్య జీవన ఔన్నత్యాన్ని,
భాగస్వామి పట్ల ప్రేమని, నమ్మకాన్ని నిలుపుకోవాల్సిన 
అవసరాన్ని చెప్పి వారి హృదయాన్ని తెరువలేక పోతున్నారు.


"ఎందుకు వారు మనసుతోనే ఆగిపోతున్నారు?"


ఇది నామనసులో చాలా రోజులనుండి నలుగుతూన్న ప్రశ్న.
దాంపత్య జీవిత గొప్పదనానికి పెద్ద పీట వేసి ప్రపంచం
లోనే గొప్పగా నిలిచిన సంస్కృతీ మన భారత దేశానిది.
మనసు వెళ్ళిన చోటుకు మనిషి వెళ్ళకుండా విలువలతో 
ఉండాలని అందరికి చెప్పిన దేశం మనది.మరి అందరి 
హృదయం తాకి ఆలుమగల మధ్య వలపు పూలు 
పూయించాల్సిన బాధ్యత అందరిది.


నది మాస పత్రికలో ఇచ్చిన దిద్దుబాటు అనే గురజాడ 
వారి కధ ఇక్కడ ప్రస్తావిస్తున్నాను.హీరో గారు సామాన్య 
మానవులే.కొంచం మనసు చపలత చెందుతుంది.
మనసు వెంట మనిషి పరిగెడుతాడు.కాని తన చదువుకున్న 
భార్య(చదువు కోక పోయినా భార్య స్థానం భార్యదే)
చిన్న నాటకం ఆడి ఇంటి పరువు పోకుండా అతని 
హృదయాన్ని మేలుకోలుపుతుంది.ఎప్పటికి సమ కాలీనాలు 
గురజాడ వారి కధలు.
ఆలు మగలు ఇహానికే కాదు పరానికి కూడా ఒక్కటి గానే 
చూడబడుతారు.అదే భారతీయత లోని అర్ధనారీశ్వర 
తత్వం.
                      
                          నువ్వు నేను 
                          మాయం 
                          అదే 
                          అర్ధ నారీశ్వర తత్త్వం 


మరి ఇంత గొప్పదైన దేశం లో ఇందరం చదువు కున్న 
వారం ఉండి ఎయిడ్స్ లో మన దేశం రెండో స్థానం లో 
ఉండటం అందరం ఆలోచించాల్సిన విషయం .దీని గూర్చి 
ప్రజల ను చైతన్య పరచటం తల్లితండ్రులదో,టీచర్స్ దో
భాద్యత కాదు ఈ గాలి ,ఈ నీరు అనుభవించిన మీ అందరిది.


మేమేమి చెయ్యగలం అనుకోకండి.ఏమి చేసి అవేర్ చెయ్యాలి 
అనుకోండి....మొన్న సాక్షి ఫండే లో చూసాను ఒక బూట్ 
పాలిష్ చేసే పేద అతను ఒక రోజు ఫ్రీగా బూట్ పాలిష్ చేసి 
భగత్ సింగ్ పై తన ప్రేమను చాటు కొన్నాడు.


బిందువు....బిందువు ....కలిస్తే సింధువు....రండి ...
మన దేశాన్ని ఎయిడ్స్ నుండి కాపాడుకుందాము.


                          చైతన్యం తో 
                          కిరణం లా సాగిపో 
                          నీ పాద ముద్రలే  
                          ఓ చరిత్ర                  






గురజాడ వారి కధ చదువుకోండి.దాంపత్య జీవిత 
పరమార్ధాన్ని భారతీయులుగా గౌరవించండి.






మీరు చదువుకున్న స్కూల్ లో ఎయిడ్స్  అవేర్ నెస్ మీద 
పోటీలు జరపోచ్చు.......
ఎయిడ్స్ మీద ప్రచారం చేసే సంస్థ లకు సాయం చేయోచ్చు.....
కనీసం మన బ్లాగ్ లో ఒక పోస్టింగ్ వేయొచ్చు.....


నేను మా విద్యార్దులకు ఎప్పుడు ఒక మాట చెపుతుంటాను.


"మంచి పనికి ముందుండు...చెడు పనికి వెనక ఉండు"


మరి మంచి ,చెడు ఎవరు చెపుతారు అంటారా?మీ హృదయమే 
దానిని ఎప్పుడు కాపాడుకుంటూ ఉండాలి.

5 comments:

శేఖర్ (Sekhar) said...

మీ ఔనత్యం చాల గొప్పది శశి గారు....
keep doing good work ....appreciated

ఆ.సౌమ్య said...

చక్కగా రాసారండీ....మంచి పోస్ట్. గురజాడవారి దిద్దుబాటు చాలా మంచి కథ!

kiran said...

>>"మంచి పనికి ముందుండు...చెడు పనికి వెనక ఉండు" -- సూఒపెర్...నేను కూడా వింటున్నా టీచర్... :)
>>మరి మంచి ,చెడు ఎవరు చెపుతారు అంటారా?మీ హృదయమే
దానిని ఎప్పుడు కాపాడుకుంటూ ఉండాలి. -- hmmmm

శశి కళ said...

sekhar gaaru,sowmya gaaru thank u.

kiran modu comments oke saari vraase vaallaku oke reply untuntundamma..
pe...dda...grrrrrrrrrrr

రాజ్ కుమార్ said...

nice post sasi gaaruu